కరోనా మహమ్మారి నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. టీజేఎస్, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో... నాగర్ కర్నూల్ జిల్లాలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎల్ శర్మ చౌహన్కు వినతిపత్రాన్ని అందజేశారు.
సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని శ్యాం ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. సెక్రటేరియట్ను కూల్చకుండా కొవిడ్ ఆసుపత్రిగా మారిస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేదన్నారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు