ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో వైకుంఠధామన్ని జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డిలు ప్రారంభించారు. సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్మశాన వాటికను చక్కగా నిర్మించారని కలెక్టర్ కొనియాడారు. అనంతరం శ్మశాన వాటికలో రకరకాల చెట్లను, డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వైకుంఠధామం త్వరితగతిన పూర్తి కావడానికి కృషి చేసిన సర్పంచ్ చంద కుమార్ను అభినందించారు. దీపావళి నుంచి ములుగు జిల్లాలో ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర