ETV Bharat / state

అంత్యక్రియలకు అధికారులు సహకరించట్లేదని గ్రామస్థుల ధర్నా - కరోనా మరణాలు

గ్రామంలో ఎవరో చనిపోతే... అధికారులు సహకరించటమేంటని ఆశ్చర్యపోకండి. చనిపోయింది ఓ కరోనా బాధితుడు మరి. ఆ మృతదేహానికి దహనసంస్కారాలు నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ములుగు జిల్లా జగన్నాథపురంలో అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఏకంగా ధర్నాకు దిగారు.

officers no response for corona  dead body cremations
officers no response for corona dead body cremations
author img

By

Published : Nov 21, 2020, 6:44 AM IST

కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి దహనసంస్కారాలు చేపట్టేందుకు అధికారులు సహకరించట్లేదని కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకగా.... వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బాధితుని పరిస్థితి విషమించగా... వరంగల్​కు తీసుకెళ్లే క్రమంలో... మార్గమధ్యలో మృతి చెందాడు.

మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామమైన జగన్నాధపురానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి జేసీబీ వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవ్వరూ రాకపోవడం వల్ల... ఈ విషయం అధికారులకు, స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవటం వల్ల తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు, గ్రామస్థులు కలిసి మృతదేహంతో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ శివ ప్రసాద్.... జేసీబీ వాహనాన్ని పంపించి దాహన సంస్కరణలు చేయించారు.

ఇదీ చూడండి: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి హత్య.. నిందితడి అరెస్టు

కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి దహనసంస్కారాలు చేపట్టేందుకు అధికారులు సహకరించట్లేదని కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకగా.... వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బాధితుని పరిస్థితి విషమించగా... వరంగల్​కు తీసుకెళ్లే క్రమంలో... మార్గమధ్యలో మృతి చెందాడు.

మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామమైన జగన్నాధపురానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి జేసీబీ వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవ్వరూ రాకపోవడం వల్ల... ఈ విషయం అధికారులకు, స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవటం వల్ల తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు, గ్రామస్థులు కలిసి మృతదేహంతో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ శివ ప్రసాద్.... జేసీబీ వాహనాన్ని పంపించి దాహన సంస్కరణలు చేయించారు.

ఇదీ చూడండి: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి హత్య.. నిందితడి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.