ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం - MLA Madhavaram Groceries Distribution at gangaputra sangham

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా గంగపుత్ర సంఘం ప్రాంతంలో కార్పొరేటర్ నర్సింహా యాదవ్​ ఆధ్వర్యంలో 1600 కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనెలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు లక్షా 20 వేల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసినట్లు ఆయన తెలిపారు.

MLA Madhavaram Groceries Distribution at gangaputra sangham
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం
author img

By

Published : May 18, 2020, 5:01 PM IST

కూకట్​పల్లి నియోజకవర్గంలో నేటికి లక్షా ఇరవై వేల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పాత బోయిన్​పల్లి డివిజన్​లోని గంగపుత్ర సంఘం ప్రాంతంలో 1600 కుటుంబాలకు కార్పొరేటర్ నర్సింహా యాదవ్​ ఆధ్వర్యంలో బియ్యం, పప్పు, నూనెలను పంపిణీ చేశారు.

లాక్​డౌన్​లో ప్రజలెవరూ ఆకలికి బాధపడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేద కుటుంబాలకు నిత్యావసరాలు, నగదు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కిరాయి దారులను యజమానులు ఇబ్బందులు పెట్టొద్దని.. దశల వారీగా తీసుకోవాలని మాధవరం కోరారు. అలా కుదరదని ఇబ్బందులు పెడితే మాత్రం కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కూకట్​పల్లి నియోజకవర్గంలో నేటికి లక్షా ఇరవై వేల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పాత బోయిన్​పల్లి డివిజన్​లోని గంగపుత్ర సంఘం ప్రాంతంలో 1600 కుటుంబాలకు కార్పొరేటర్ నర్సింహా యాదవ్​ ఆధ్వర్యంలో బియ్యం, పప్పు, నూనెలను పంపిణీ చేశారు.

లాక్​డౌన్​లో ప్రజలెవరూ ఆకలికి బాధపడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేద కుటుంబాలకు నిత్యావసరాలు, నగదు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కిరాయి దారులను యజమానులు ఇబ్బందులు పెట్టొద్దని.. దశల వారీగా తీసుకోవాలని మాధవరం కోరారు. అలా కుదరదని ఇబ్బందులు పెడితే మాత్రం కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్​ నంబర్​తో పట్టేస్తారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.