కరోనా వ్యాప్తి కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. వైరస్ను అరికట్టడంలో ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేకుండా ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు.
నాలుగు రోజులు గడుస్తున్న కొత్త టెస్టులు చేపట్టడం లేదని శ్రీశైలం గౌడ్ తెలిపారు. ఇప్పటికే పలు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహార్ నగర్కు చెందిన ఓ వ్యక్తి చనిపోవడం బాధాకరమన్నారు.
3టీ (టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్) పద్ధతిలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లాలో ప్రతి ఇంటింటికి సర్వే చేసి కరోనా టెస్టులు ఉచితంగా చేయాలని శ్రీశైలం గౌడ్ కోరారు. చేసి భయ బ్రాంతులతో ఉన్న ప్రజానికానికి అండగా నిలవాలని కోరారు.
ఇదీ చదవండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్డౌన్పై తుది నిర్ణయం