మెదక్ జిల్లా కేంద్రంలోని మెదక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 13 డైరెక్టర్లుండగా.. రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా ఎన్నిక ఏకగ్రీవమైంది.
పీఏసీఎస్ అధ్యక్షునిగా చిలుముల హనుమంత్రెడ్డి ఎంపికవ్వగా.. ఉపాధ్యక్షునిగా కాస సూర్యతేజ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రాంబాబు తెలిపారు. అనంతరం డైరెక్టర్లకు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా