ETV Bharat / state

క్రిస్మస్​ వేడుకలకు ముస్తాబైన మెదక్​ చర్చి

author img

By

Published : Dec 24, 2019, 6:11 PM IST

ఆసియా ఖండంలోని రెండో అతి పెద్ద చర్చిగా ప్రఖ్యాతి గాంచిన సీఎస్ఐ మెదక్ చర్చి క్రిస్మస్​ వేడుకలకు ముస్తాబైంది. భక్తుల సౌకర్యార్థం చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

medak church is ready for christmas celebrations
క్రిస్మస్​ వేడుకలకు ముస్తాబైన మెదక్​ చర్చి
క్రిస్మస్​ వేడుకలకు ముస్తాబైన మెదక్​ చర్చి

క్రిస్మస్​ వేడుకలకు మెదక్​ చర్చి ముస్తాబైంది. రంగురంగుల విద్యుద్దీపాలతో చర్చి ప్రాంగణం కాంతులీనుతోంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బుధవారం ఉదయం నాలుగు గంటలకు బిషప్ రైట్ రెవరెండ్ సాల్మన్ రాజ్ దైవసందేశంతో మొదటి ఆరాధన ప్రారంభం కానుంది.

ఉదయం 9 గంటలకు రెండో ఆరాధన, మధ్యాహ్నం 2 గంటలకు మూడో ఆరాధన జరగనుంది. సాయంత్రం 5 గంటలకు మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు .

క్రిస్మస్​ వేడుకలకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం చర్చి నిర్వాహకులు వసతిగృహాలతోపాటు తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రత్యేక పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో 450 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

క్రిస్మస్​ వేడుకలకు ముస్తాబైన మెదక్​ చర్చి

క్రిస్మస్​ వేడుకలకు మెదక్​ చర్చి ముస్తాబైంది. రంగురంగుల విద్యుద్దీపాలతో చర్చి ప్రాంగణం కాంతులీనుతోంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బుధవారం ఉదయం నాలుగు గంటలకు బిషప్ రైట్ రెవరెండ్ సాల్మన్ రాజ్ దైవసందేశంతో మొదటి ఆరాధన ప్రారంభం కానుంది.

ఉదయం 9 గంటలకు రెండో ఆరాధన, మధ్యాహ్నం 2 గంటలకు మూడో ఆరాధన జరగనుంది. సాయంత్రం 5 గంటలకు మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు .

క్రిస్మస్​ వేడుకలకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం చర్చి నిర్వాహకులు వసతిగృహాలతోపాటు తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రత్యేక పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో 450 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Intro:TG_SRD_42_24_MEDAK_CHARUCH_AV_TS10115_VO.
రిపోర్టర్. శేఖర్.
మెదక్..9000302217..
ఆసియా ఖండంలోని రెండో అతి పెద్ద చర్చి గా ప్రఖ్యాతి గాంచిన సిఎస్ఐ మెదక్ మహా దేవాలయం బుధవారం జరిగే క్రిస్మస్ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది మహాదేవ్ ఆలయం రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు..
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఉదయం నాలుగు గంటలకు బిషప్ రైట్ రెవరెండ్ సాల్మన్ రాజ్ దైవసందేశం తో మొదటి ఆరాధన ప్రారంభమై వేడుకలకు శ్రీకారం చుట్టానున్నారు.

అనంతరం రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు.
మూడవ ఆరాధన రెండు గంటలకు .
సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు మత గురువులు నిర్వహించనున్నారు .
అందుకు అనుగుణంగా చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు
ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుండి కాక పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,రాష్ట్రాల తో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలి రానున్నారు.
భక్తుల సౌకర్యార్థం చర్చి నిర్వాహకులు వసతిగృహాల తోపాటు త్రాగునీరు పారిశుద్ధ్యం ప్రత్యేకంగా పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశారు.
వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో 450 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు..


Body:విజువల్స్


Conclusion: శేఖర్ మెదక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.