ETV Bharat / state

ఖజానా నింపేందుకే ఎల్​ఆర్​ఎస్: భాజపా

author img

By

Published : Sep 29, 2020, 12:32 PM IST

తెలంగాణ సర్కార్ ఖజానాను నింపుకోవడానికే ఎల్​ఆర్​ఎస్​ పేరిట ప్రజలను నిలువుదోపిడీ చేస్తోందని భాజపా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విమర్శించారు. గ్రామస్థాయిలో ఇల్లు నిర్మించుకునే పేదలకు ఎల్​ఆర్​ఎస్​ మరింత భారం కానుందని తెలిపారు.

BJP protest against Layout Regularization Scheme
మెదక్​లో భాజపా నేతల ఆందోళన

పేద ప్రజల పాలిట శాపమవనున్న ఎల్​ఆర్​ఎస్​ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్​ జిల్లా తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. ఖజానాను నింపుకోవడానికే తెలంగాణ సర్కార్.. ఎల్​ఆర్​ఎస్​ పేరిట ప్రజలను నిలువుదోపిడీ చేస్తోందని భాజపా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విమర్శించారు. గ్రామస్థాయిలో ఇల్లు నిర్మించుకునే పేదలకు ఎల్​ఆర్​ఎస్​ మరింత భారం కానుందని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఎస్సీ,ఎస్టీలకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్​రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు నెరవేర్చలేదని శ్రీనివాస్ మండిపడ్డారు. ఎల్​ఆర్​ఎస్​ను వెంటనే రద్దు చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు నల్లాల విజయ్, మాజీ జడ్పీటీసీ మల్లప్ప, బెండ వీణ, భాజపా నాయకులు పాల్గొన్నారు.

పేద ప్రజల పాలిట శాపమవనున్న ఎల్​ఆర్​ఎస్​ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్​ జిల్లా తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. ఖజానాను నింపుకోవడానికే తెలంగాణ సర్కార్.. ఎల్​ఆర్​ఎస్​ పేరిట ప్రజలను నిలువుదోపిడీ చేస్తోందని భాజపా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విమర్శించారు. గ్రామస్థాయిలో ఇల్లు నిర్మించుకునే పేదలకు ఎల్​ఆర్​ఎస్​ మరింత భారం కానుందని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఎస్సీ,ఎస్టీలకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్​రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు నెరవేర్చలేదని శ్రీనివాస్ మండిపడ్డారు. ఎల్​ఆర్​ఎస్​ను వెంటనే రద్దు చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు నల్లాల విజయ్, మాజీ జడ్పీటీసీ మల్లప్ప, బెండ వీణ, భాజపా నాయకులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.