ETV Bharat / state

మాస్క్​ ధరించి వస్తేనే మందు అమ్మండి: శ్రీనివాస్​గౌడ్

author img

By

Published : May 6, 2020, 1:28 PM IST

Updated : May 6, 2020, 3:58 PM IST

srinivas-goud-review-on-liquor-sales
అమ్మకాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష

13:26 May 06

మాస్క్​ ధరించి వస్తేనే మందు అమ్మండి: శ్రీనివాస్​గౌడ్

హైదరాబాద్‌ నాంపల్లి ఆబ్కారి భవన్ కమిషనర్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు అదనపు కమిషనర్ అజేయ్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, బెవరేజ్‌ కార్పోరేషన్ అధికారులు పాల్గొన్నారు. నెలన్నర రోజుల తర్వాత ఇవాళ మద్యం దుకాణాలు తెరవగా మందుబాబులు.. మద్యం కోసం బారులు తీరారు. దుకాణాలు, ఎక్సైజ్ డిపోలు, డిస్టలరీలలో ఉన్న మద్యం నిల్వలపై మంత్రి సమీక్షించారు.

 తాజాగా మద్యంపై 16 శాతం పెరిగిన ధరలను అప్​డేషన్ చేయడం, మద్యం దుకాణాలకు ఎప్పటి నుంచి కొత్త సరుకు సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది తదితర అంశాలను మంత్రి.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన 16 శాతం ధరల కారణంగా నెలకి రూ. 300 నుంచి 320 కోట్లు ప్రభుత్వానికి అదనపు ఆదాయం చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులు బారులు తీరి నిలబడినప్పటికీ.. భౌతిక దూరం పాటించేలా చూడాలని మాస్కులు లేని వారికి మద్యం విక్రయించరాదని ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు


 

13:26 May 06

మాస్క్​ ధరించి వస్తేనే మందు అమ్మండి: శ్రీనివాస్​గౌడ్

హైదరాబాద్‌ నాంపల్లి ఆబ్కారి భవన్ కమిషనర్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు అదనపు కమిషనర్ అజేయ్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, బెవరేజ్‌ కార్పోరేషన్ అధికారులు పాల్గొన్నారు. నెలన్నర రోజుల తర్వాత ఇవాళ మద్యం దుకాణాలు తెరవగా మందుబాబులు.. మద్యం కోసం బారులు తీరారు. దుకాణాలు, ఎక్సైజ్ డిపోలు, డిస్టలరీలలో ఉన్న మద్యం నిల్వలపై మంత్రి సమీక్షించారు.

 తాజాగా మద్యంపై 16 శాతం పెరిగిన ధరలను అప్​డేషన్ చేయడం, మద్యం దుకాణాలకు ఎప్పటి నుంచి కొత్త సరుకు సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది తదితర అంశాలను మంత్రి.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన 16 శాతం ధరల కారణంగా నెలకి రూ. 300 నుంచి 320 కోట్లు ప్రభుత్వానికి అదనపు ఆదాయం చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులు బారులు తీరి నిలబడినప్పటికీ.. భౌతిక దూరం పాటించేలా చూడాలని మాస్కులు లేని వారికి మద్యం విక్రయించరాదని ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు


 

Last Updated : May 6, 2020, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.