ETV Bharat / state

Farmers Problems: అన్నదాత ఉసురు తీస్తోన్న ముసురు.. తేమకు మొలకెత్తుతోన్న ధాన్యం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురుస్తున్న ముసురు రైతన్న ఉసురుతీస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వానల కారణంగా ఎక్కడికక్కడ మొలకెత్తుతోంది. మొలకెత్తని ధాన్యాన్నైనా వెంటనే అమ్మేద్దామంటే తేమ అధికంగా ఉన్న కారణంగా కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదు. వానలకు ఉన్న పంట దెబ్బతింటుందని అమ్మేయాలా.. ఎండలొస్తే ఆరబెట్టి మద్దతు ధరకే అమ్ముకోవాలా తేల్చుకోలేక అన్నదాత ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

author img

By

Published : Nov 21, 2021, 5:24 AM IST

rice-farmers-facing-problems-with-rains-in-telangana
rice-farmers-facing-problems-with-rains-in-telangana

ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరపి లేకుండా కురుస్తున్న ముసురు, అక్కడక్కడా పడుతున్న వానలు ధాన్యం పండించిన వరి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో కురిసిన వానలకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి మొలకెత్తింది. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో రైతుల ధాన్యం మొలకెత్తి ఎందుకూ పనికి రాకుండా పోతోంది. ధాన్యం తీసుకువచ్చి వారం పది రోజులైనా తేమ శాతం పేరిట ప్రభుత్వ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని కొనడం లేదు. నాణ్యత పేరిట పదేపదే తూర్పార పట్టమంటున్నారని.. తేమ శాతం వచ్చినా కొనుగోళ్లు చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

rice-farmers-facing-problems-with-rains-in-telangana
తేమకు మొలకెత్తుతోన్న ధాన్యం

ఎందుకు పనిరాకుండా పోతోంది..

నెల రోజుల కిందట కేంద్రానికి చేరిన ధాన్యాన్నే ఇప్పటికీ కొనుగోలు చేయలేదని, ధాన్యం ఇంకా వస్తే ఎప్పడు కొనుగోలు చేస్తారని మండిపడుతున్నారు. వానలు పడ్డప్పుడల్లా నేలమీద ధాన్యం తడిసి మొలకెత్తుతోందని వాపోతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం జాప్యం కారణంగా కొంత మొలకెత్తగా.. మరికొంత రంగు మారిందని.. వానలు ఇలాగే కొనసాగితే పండించిన పంట ఎందుకు పనికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల మాత్రమే కాదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాలలోనూ ఇదే దుస్థితి. ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగడం లేదు. వాతావరణం అనుకూలించక రైతులు ఆపదలో ఉన్న వేళ ప్రభుత్వమే చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం రంగుమారినా, మొలకెత్తినా, నాణ్యత లేకపోయినా తక్షణం కొనుగోళ్లు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

rice-farmers-facing-problems-with-rains-in-telangana
మొలకొచ్చిన ధాన్యం కుప్ప

పైవేటు వ్యాపారుల దందా..

సందడ్లో సడేమియా అన్నట్లుగా వ్యవసాయ మార్కెట్ లలోనూ వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. క్వింటా 1960 రూపాయలు పలకాల్సిన వరి ప్రైవేటులో నాణ్యతను బట్టి 800 నుంచి 1200 రూపాయల వరకూ ధర పలుకుతోంది. మరో గత్యంతరం లేక రైతులు కూడా వచ్చిన సొమ్మే చాలని తెగనమ్ముకుంటున్నారు. వానలకు తడిసి పూర్తిగా నష్టపోవడం కంటే వచ్చిందే మేలని వరిని ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకే మొగ్గు చూపుతున్నారు.

rice-farmers-facing-problems-with-rains-in-telangana
నారొచ్చిన వడ్లు....

మరో రెండు, మూడు రోజుల పాటు ముసురు లేదా వానలు అలాగే కురిస్తే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన సగానికి పైగా ధాన్యం మొలకెత్తే అవకాశం కనిపిస్తోంది. తెచ్చిన ధాన్యాన్ని రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదమూ ఉంది. ప్రభుత్వం సత్వరం స్పందించి రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని రైతుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Rice farmers facing problems with rains in telangana
మొలకలొచ్చిన వడ్లు

ఇదీ చూడండి:

ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరపి లేకుండా కురుస్తున్న ముసురు, అక్కడక్కడా పడుతున్న వానలు ధాన్యం పండించిన వరి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో కురిసిన వానలకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి మొలకెత్తింది. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో రైతుల ధాన్యం మొలకెత్తి ఎందుకూ పనికి రాకుండా పోతోంది. ధాన్యం తీసుకువచ్చి వారం పది రోజులైనా తేమ శాతం పేరిట ప్రభుత్వ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని కొనడం లేదు. నాణ్యత పేరిట పదేపదే తూర్పార పట్టమంటున్నారని.. తేమ శాతం వచ్చినా కొనుగోళ్లు చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

rice-farmers-facing-problems-with-rains-in-telangana
తేమకు మొలకెత్తుతోన్న ధాన్యం

ఎందుకు పనిరాకుండా పోతోంది..

నెల రోజుల కిందట కేంద్రానికి చేరిన ధాన్యాన్నే ఇప్పటికీ కొనుగోలు చేయలేదని, ధాన్యం ఇంకా వస్తే ఎప్పడు కొనుగోలు చేస్తారని మండిపడుతున్నారు. వానలు పడ్డప్పుడల్లా నేలమీద ధాన్యం తడిసి మొలకెత్తుతోందని వాపోతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం జాప్యం కారణంగా కొంత మొలకెత్తగా.. మరికొంత రంగు మారిందని.. వానలు ఇలాగే కొనసాగితే పండించిన పంట ఎందుకు పనికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల మాత్రమే కాదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాలలోనూ ఇదే దుస్థితి. ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగడం లేదు. వాతావరణం అనుకూలించక రైతులు ఆపదలో ఉన్న వేళ ప్రభుత్వమే చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం రంగుమారినా, మొలకెత్తినా, నాణ్యత లేకపోయినా తక్షణం కొనుగోళ్లు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

rice-farmers-facing-problems-with-rains-in-telangana
మొలకొచ్చిన ధాన్యం కుప్ప

పైవేటు వ్యాపారుల దందా..

సందడ్లో సడేమియా అన్నట్లుగా వ్యవసాయ మార్కెట్ లలోనూ వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. క్వింటా 1960 రూపాయలు పలకాల్సిన వరి ప్రైవేటులో నాణ్యతను బట్టి 800 నుంచి 1200 రూపాయల వరకూ ధర పలుకుతోంది. మరో గత్యంతరం లేక రైతులు కూడా వచ్చిన సొమ్మే చాలని తెగనమ్ముకుంటున్నారు. వానలకు తడిసి పూర్తిగా నష్టపోవడం కంటే వచ్చిందే మేలని వరిని ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకే మొగ్గు చూపుతున్నారు.

rice-farmers-facing-problems-with-rains-in-telangana
నారొచ్చిన వడ్లు....

మరో రెండు, మూడు రోజుల పాటు ముసురు లేదా వానలు అలాగే కురిస్తే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన సగానికి పైగా ధాన్యం మొలకెత్తే అవకాశం కనిపిస్తోంది. తెచ్చిన ధాన్యాన్ని రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదమూ ఉంది. ప్రభుత్వం సత్వరం స్పందించి రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని రైతుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Rice farmers facing problems with rains in telangana
మొలకలొచ్చిన వడ్లు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.