ETV Bharat / state

వారి ఇళ్లకు ఎరుపు రంగు వేయండి: శ్రీనివాస్​గౌడ్

విదేశాల నుంచి కాని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు ఎరుపు రంగు వేయాలని మంత్రి శ్రీనివాస్​గౌడ్ అధికారులను ఆదేశించారు. మహబూబ్​నగర్ కలెక్టరేట్​లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

author img

By

Published : Mar 23, 2020, 10:39 PM IST

Minister srinivas goud review on corona virus
వారి ఇళ్లకు ఎరుపు రంగు వేయండి: శ్రీనివాస్​గౌడ్
వారి ఇళ్లకు ఎరుపు రంగు వేయండి: శ్రీనివాస్​గౌడ్

సొంత ప్రాణాలతోనే కాదు.. ప్రజల ప్రాణాలతోనూ చెలగాటం ఆడొద్దని.. ప్రతి ఒక్కరు ప్రభుత్వమిచ్చిన మార్గదర్శకాలను పాటించి ఇళ్లకే పరిమితం కావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహబూబ్​నగర్ కలెక్టరేట్​లో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరి సహా జిల్లా ఉన్నతాధికారులతో కరోనా నియంత్రణపై ఆయన సమీక్ష నిర్వహించారు.

182 మంది..

182 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చారని వారందరినీ స్వీయ నిర్బంధంలో ఉంచామని మంత్రి చెప్పారు. జిల్లా నుంచి ముంబయి, పూణె సహా ఇతర నగరాలకు వలస వెళ్లిన వాళ్లు.. అక్కడ కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల జిల్లాకు వస్తున్నారని చెప్పారు. అలాంటి వారి సమాచారం వెంటనే జిల్లా అధికారులకు ఇవ్వాలని ఆయన కోరారు. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని.. గృహ నిర్బంధం లేదా క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందవచ్చని తెలిపారు.

ఎరుపురంగు వేయండి..

ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు ఎరుపురంగుతో అక్షరాలు రాసి అందరికీ తెలిసేలా చేయాలన్నారు. క్వారంటైన్ ముద్ర ఉన్నా కొందరు బహిరంగంగానే తిరుగుతున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి : కరోనాపై భారత్​ సమరం- లాక్​డౌన్​లో పలు రాష్ట్రాలు

వారి ఇళ్లకు ఎరుపు రంగు వేయండి: శ్రీనివాస్​గౌడ్

సొంత ప్రాణాలతోనే కాదు.. ప్రజల ప్రాణాలతోనూ చెలగాటం ఆడొద్దని.. ప్రతి ఒక్కరు ప్రభుత్వమిచ్చిన మార్గదర్శకాలను పాటించి ఇళ్లకే పరిమితం కావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహబూబ్​నగర్ కలెక్టరేట్​లో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరి సహా జిల్లా ఉన్నతాధికారులతో కరోనా నియంత్రణపై ఆయన సమీక్ష నిర్వహించారు.

182 మంది..

182 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చారని వారందరినీ స్వీయ నిర్బంధంలో ఉంచామని మంత్రి చెప్పారు. జిల్లా నుంచి ముంబయి, పూణె సహా ఇతర నగరాలకు వలస వెళ్లిన వాళ్లు.. అక్కడ కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల జిల్లాకు వస్తున్నారని చెప్పారు. అలాంటి వారి సమాచారం వెంటనే జిల్లా అధికారులకు ఇవ్వాలని ఆయన కోరారు. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని.. గృహ నిర్బంధం లేదా క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందవచ్చని తెలిపారు.

ఎరుపురంగు వేయండి..

ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు ఎరుపురంగుతో అక్షరాలు రాసి అందరికీ తెలిసేలా చేయాలన్నారు. క్వారంటైన్ ముద్ర ఉన్నా కొందరు బహిరంగంగానే తిరుగుతున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి : కరోనాపై భారత్​ సమరం- లాక్​డౌన్​లో పలు రాష్ట్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.