ETV Bharat / state

'ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావేదికలు'

author img

By

Published : Jan 28, 2021, 5:11 PM IST

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా వేదిక ఆన్ లైన్ - ఫిర్యాదుల నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్‌.వెంకటరావుతో కలసి ప్రారంభించారు.

Minister Srinivas Gowda inaugurated the Prajavedhika Online Complaints Center
'ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావేదికలు'

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్​ కార్యాలయంలో ప్రజా వేదిక ఆన్​లైన్​ ఫిర్యాదుల కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా వేదికలో నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇక్కడ నమోదు చేసుకున్న ఫిర్యాదులకు... సత్వరమే పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తన క్యాంప్ కార్యాలయంలో ప్రతి గురువారం ప్రజా వేదికను నిర్వహిస్తామని వివరించారు. వచ్చిన ఫిర్యాదులను క్రమ పద్ధతిలో నమోదు చేసుకుని.. సంబంధిత అధికారులకు పంపించడమే కాకుండా... సత్వర పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెలలో వచ్చిన ఫిర్యాదులపై ఒకసారి జిల్లా స్థాయి అధికారులతో సమీక్షిస్తామన్నారు.

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్​ కార్యాలయంలో ప్రజా వేదిక ఆన్​లైన్​ ఫిర్యాదుల కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా వేదికలో నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇక్కడ నమోదు చేసుకున్న ఫిర్యాదులకు... సత్వరమే పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తన క్యాంప్ కార్యాలయంలో ప్రతి గురువారం ప్రజా వేదికను నిర్వహిస్తామని వివరించారు. వచ్చిన ఫిర్యాదులను క్రమ పద్ధతిలో నమోదు చేసుకుని.. సంబంధిత అధికారులకు పంపించడమే కాకుండా... సత్వర పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెలలో వచ్చిన ఫిర్యాదులపై ఒకసారి జిల్లా స్థాయి అధికారులతో సమీక్షిస్తామన్నారు.

ఇదీ చూడండి: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో భృతి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.