ETV Bharat / state

"తెలంగాణ రాకుంటే నీటికి అవస్థలు పడేవాళ్లం"

నీటిని పొదుపు చేయకుంటే భవిష్యత్​లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి​ అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడలో జరిగిన జలశక్తి అభియాన్​ కిసాన్​ మేళాలో పాల్గొన్నారు.

author img

By

Published : Sep 4, 2019, 4:29 PM IST

శ్రీనివాస్​ గౌడ్​, నిరంజన్​ రెడ్డి
నీటిని పొదుపు చేయండి: మంత్రులు

తెలంగాణ రాకుంటే నీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేదని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడలో జరిగిన జలశక్తి అభియాన్​ కిసాన్​ మేళాలో వారు మాట్లాడారు. మిషన్​ కాకతీయ, మిషన్​ భగీరథతో తెలంగాణలో నీరు పుష్కలంగా ఉందన్నారు. దేశంలోని చాలా ప్రాంతాలు నీటి సమస్య ఎదుర్కొంటున్నాయని తెలిపారు. నీటిని పొదుపు చేయకుంటే తీవ్ర ఇబ్బందులు పడతామని హెచ్చరించారు. అందుకే ప్రతిఒక్కరూ బాధ్యతగా నీటిని పొదుపు చేయాలని కోరారు. కేంద్రం జలశక్తి అభియాన్​ పేరుతో ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు

నీటిని పొదుపు చేయండి: మంత్రులు

తెలంగాణ రాకుంటే నీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేదని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడలో జరిగిన జలశక్తి అభియాన్​ కిసాన్​ మేళాలో వారు మాట్లాడారు. మిషన్​ కాకతీయ, మిషన్​ భగీరథతో తెలంగాణలో నీరు పుష్కలంగా ఉందన్నారు. దేశంలోని చాలా ప్రాంతాలు నీటి సమస్య ఎదుర్కొంటున్నాయని తెలిపారు. నీటిని పొదుపు చేయకుంటే తీవ్ర ఇబ్బందులు పడతామని హెచ్చరించారు. అందుకే ప్రతిఒక్కరూ బాధ్యతగా నీటిని పొదుపు చేయాలని కోరారు. కేంద్రం జలశక్తి అభియాన్​ పేరుతో ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.