ETV Bharat / state

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

author img

By

Published : Feb 6, 2020, 9:20 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడున్నర లక్షల విలువైన బంగారం, వెండి, రెండు ద్విచక్రవాహనాలు, కారు స్వాధీనం చేసుకున్నారు.

Dacoits Arrest
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

నిలిపి ఉంచిన వాహనాల నుంచి డీజిల్​ దొంగిలించడమే కాకుండా.... తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను మహబూబ్​నగర్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడున్నర లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు... రెండు ద్విచక్ర వాహనాలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్​ తెలిపారు.

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రం సమీపంలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సీసీఎస్ పోలీసులు... అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలోని ఓ సభ్యుడు ఇతర కేసులో జైలులో ఉండగా... మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

ఇదీ చూడండి: స్లాబ్​ వేస్తుండగా ప్రమాదం..21మందికి గాయాలు

నిలిపి ఉంచిన వాహనాల నుంచి డీజిల్​ దొంగిలించడమే కాకుండా.... తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను మహబూబ్​నగర్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడున్నర లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు... రెండు ద్విచక్ర వాహనాలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్​ తెలిపారు.

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రం సమీపంలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సీసీఎస్ పోలీసులు... అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలోని ఓ సభ్యుడు ఇతర కేసులో జైలులో ఉండగా... మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

ఇదీ చూడండి: స్లాబ్​ వేస్తుండగా ప్రమాదం..21మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.