సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా తెరాస తీర్థం పుచ్చుకుంటున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయం మహబూబాబాద్ పట్టణంలోని మూడో డివిజన్లోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నికలు ఏదైనా ప్రజలు తెరాసకే మద్దతుగా నిలిచారని, వచ్చే పుర ఎన్నికల్లో తెరాసకు మద్దతుగా నిలవాలని శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి : ఆమె కోసమే సతీష్ను స్నేహితుడు చంపేశాడా!?