ETV Bharat / state

కల్లం నూర్పించి.. కాంటా వేయించి.. - mahabubabad zp chair person bindu

కరోనా ఆ కర్షకుడి కుటుంబాన్ని కుదేలు చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోకుండా అలుముకుంది. కల్లంలో దీనంగా పడి ఉన్న మొక్కజొన్న పంటను కాంటా వేయించి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకున్నారు జడ్పీ ఛైర్​పర్సన్ బిందు.

mahabubabad zp chair person helped a farmer in selling his crop
కల్లం నూర్పించి.. కాంటా వేయించి..
author img

By

Published : May 3, 2020, 10:23 AM IST

స్వయంగా కాంటా పెడుతున్న బిందు

మహబూబాబాద్​ జిల్లా బయ్యారంలోని ఓ రైతు కుటుంబంలోని వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో కుటుంబాన్ని అధికారులు నాలుగు రోజుల కిందట హోం క్వారంటైన్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆ రైతు పంట కల్లంలో ఉన్న మొక్కజొన్న పంటను చూసేవారు లేక, బయటకు వచ్చే పరిస్థితి లేక అన్నదాత కుటుంబం ఆందోళన చెందుతుండగా.. విషయం తెలుసుకున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు స్వయంగా రైతు పంట కళ్లంలోకి వచ్చి పంటను పరిశీలించారు. మొక్కజొన్నను దగ్గరుండి ఒక్కచోటకు నూర్పించి కాంటా వేయించి బస్తాలను గోదాముకు తరలించారు. పీఏసీఎస్‌ అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.

స్వయంగా కాంటా పెడుతున్న బిందు

మహబూబాబాద్​ జిల్లా బయ్యారంలోని ఓ రైతు కుటుంబంలోని వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో కుటుంబాన్ని అధికారులు నాలుగు రోజుల కిందట హోం క్వారంటైన్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆ రైతు పంట కల్లంలో ఉన్న మొక్కజొన్న పంటను చూసేవారు లేక, బయటకు వచ్చే పరిస్థితి లేక అన్నదాత కుటుంబం ఆందోళన చెందుతుండగా.. విషయం తెలుసుకున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు స్వయంగా రైతు పంట కళ్లంలోకి వచ్చి పంటను పరిశీలించారు. మొక్కజొన్నను దగ్గరుండి ఒక్కచోటకు నూర్పించి కాంటా వేయించి బస్తాలను గోదాముకు తరలించారు. పీఏసీఎస్‌ అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.