2, 800 కిలోల బెల్లం, 400 కేజీల పటిక పట్టివేత కుమురం భీం జిల్లా చింతలమనేపల్లి మండలం లంబడి హెట్టి వద్ద 2 లక్షల 56 వేల విలువ గల బెల్లం, పటికను ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని గోండ్ పిప్పిరి నుంచి లంబడి హెట్టి గ్రామానికి తరలిస్తున్న క్రమంలో వాహనాలను తనిఖీ చేయగా 2 వేల 800 కిలోల బెల్లం, 400 కిలోల పటిక పట్టుబడింది. సామగ్రిని స్వాధీన పర్చుకొని బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. హెట్టి గ్రామానికి చెందిన అజమేర శ్రీకాంత్, జరుపుల శంకర్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ మహేందర్ సింగ్ తెలిపారు.
ఇవీ చూడండి: ఆసిఫ్నగర్ ఏసీపీ నరసింహారెడ్డిపై బదిలీ వేటు