కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 'దిశ' ఆత్మకు శాంతి చేకూరాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ఎస్సై గంగన్న, పెద్ద ఎత్తున యవతీయువకులు, మహిళలు పాల్గొన్నారు. నిందితులను శిక్షించడంతో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆగ్రహించారు. వారిని వెంటనే శిక్షిస్తే మరెవరైన ఇలాంటి ఘటనలకు పూనుకోవడానికి భయపడతారన్నారు.
ఇవీచూడండి: దత్తత తల్లిదండ్రుల వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య