ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శిబిరంలో ధర్నా చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని వ్యాపారులు హెచ్చరించారు. ధర్నాకు న్యూ డెమోక్రసీ నాయకులు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: కొత్త మండలంగా మాసాయిపేట.. తుది నోటిఫికేషన్ విడుదల