ETV Bharat / state

అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ నామ, భట్టి

author img

By

Published : Apr 14, 2021, 3:32 PM IST

ఖమ్మం జిల్లా మధిరలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఎంపీ నామ, భట్టి ఆవిష్కరించారు. భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత రాజ్యాంగం దిక్సూచి అని ఈ సందర్భంగా తెలిపారు.

అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ నామ, భట్టి
అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ నామ, భట్టి

ఖమ్మం జిల్లా మధిరలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆవిష్కరించారు.

భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత రాజ్యాంగం దిక్సూచి అని ఈ సందర్భంగా తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు అంబేడ్కర్​ రచించిన రాజ్యాంగం ప్రపంచదేశాలకు స్ఫూర్తిదాయకం అన్నారు.

ఖమ్మం జిల్లా మధిరలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆవిష్కరించారు.

భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత రాజ్యాంగం దిక్సూచి అని ఈ సందర్భంగా తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు అంబేడ్కర్​ రచించిన రాజ్యాంగం ప్రపంచదేశాలకు స్ఫూర్తిదాయకం అన్నారు.

ఇదీ చూడండి: తెరాస పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిబాట: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.