ETV Bharat / state

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి

రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కరుణగిరిలో మంత్రి అజయ్​కుమార్​ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఖమ్మం కరోనా రహిత జిల్లాగా మారిందని మంత్రి తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

author img

By

Published : May 10, 2020, 4:35 PM IST

minister ajay kumar  groceries distribution in khammam district
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి

కరోనా రహిత జిల్లాగా ఖమ్మం జిల్లా మారిపోయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ అన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం కరుణగిరి సమీపంలోని రాజీవ్ గృహకల్పలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో గత 14 రోజులుగా కరోనా కేసులు నమోదు కాలేదని వారం రోజుల్లో గ్రీన్ జోన్​గా మారిపోతుందని మంత్రి చెప్పారు. గ్రీన్ జోన్ ఏర్పడిన తర్వాత కూడా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చేతులు కడుక్కోవటం, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం వంటివి కచ్చితంగా పాటించాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు తమ దాతృత్వాన్ని చూపించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు సునీల్ రెడ్డి, అఫ్జల్ హసన్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా రహిత జిల్లాగా ఖమ్మం జిల్లా మారిపోయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ అన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం కరుణగిరి సమీపంలోని రాజీవ్ గృహకల్పలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో గత 14 రోజులుగా కరోనా కేసులు నమోదు కాలేదని వారం రోజుల్లో గ్రీన్ జోన్​గా మారిపోతుందని మంత్రి చెప్పారు. గ్రీన్ జోన్ ఏర్పడిన తర్వాత కూడా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చేతులు కడుక్కోవటం, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం వంటివి కచ్చితంగా పాటించాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు తమ దాతృత్వాన్ని చూపించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు సునీల్ రెడ్డి, అఫ్జల్ హసన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: చిన్నకోడూర్​ మండలంలో పర్యటించిన హరీశ్​రావు


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.