ETV Bharat / state

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తుదిదశకు ఆస్తుల నమోదు ప్రక్రియ

author img

By

Published : Oct 21, 2020, 4:43 PM IST

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ధరణి సర్వే.. రెండు జిల్లాల్లో అనుకున్న లక్ష్యాలు చేరుకుంటోంది. ఖమ్మం జిల్లాలో 93 శాతం, భద్రాద్రి జిల్లాలో 99.53 శాతం పూర్తైంది. 100 శాతం సాధించాలన్న లక్ష్యంతో ఉభయ జిల్లాల యంత్రాంగం పనిచేస్తోంది.

dharani survey in final stage in joint khammam district
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తుదిదశకు ఆస్తుల నమోదు ప్రక్రియ
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తుదిదశకు ఆస్తుల నమోదు ప్రక్రియ

వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి సర్వే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లక్ష్యాన్ని చేరుకుంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆస్తుల నమోదు ప్రక్రియ గడువు మేర సత్ఫలితాలు సాధిస్తోంది. ప్రతి పల్లె నుంచి పట్టణం, నగరాల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు యుద్ధప్రాతిపాదికన ఆస్తుల గణన చేపట్టారు. సర్వే మొదలైనప్పుడు కొన్ని చోట్ల అనేక రకాల ఇబ్బందులు, ఆన్‌లైన్‌లో సాంకేతిక పరమైన అవరోధాలు ఎదురైనా అధిగమిస్తూ లక్ష్యం మేర ప్రక్రియ పూర్తి చేసేలా చేపట్టిన కార్యాచరణ సఫలీకృతమైంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ఆర్.వి. కర్ణన్, ఎంవీ రెడ్డి ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతోపాటు దిశానిర్దేశం చేయడం వల్ల ఆస్తుల నమోదు పూర్తికావచ్చింది.

ప్రత్యేక బృందాలు రంగంలోకి..

గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ధరణి సర్వే బృందాలు రంగంలోకి దిగి ఆస్తుల నమోదు చేపట్టాయి. సెలవు దినాల్లోనూ ముమ్మరంగా సర్వే జరగడం వల్ల ప్రక్రియ పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చింది. వ్యవసాయేతర ఆస్తులకు ప్రత్యేకంగా పాసు పుస్తకం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో ప్రజలు కూడా సర్వేకు సహకరించారు. ఖమ్మం జిల్లాలో 93 శాతం ధరణి సర్వే పూర్తవ్వగా... భద్రాద్రి జిల్లాలో 99.53 శాతం పూర్తయినట్లు రెండు జిల్లాల అధికారులు ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలో 2లక్షల75వేల 164 ఇళ్ల వివరాలు సేకరించాల్సి ఉండగా... 2లక్షల 75వేల ఆస్తుల గణన పూర్తి చేశారు. జిల్లాలో 398 బృందాలు పనిచేశాయి.

పలు పట్టణాల్లో 100శాతం

ఖమ్మం జిల్లాలోని 584 పంచాయతీల్లో 2లక్షల 80వేల 811 ఆస్తుల నమోదు చేపట్టాల్సి ఉండగా... 2లక్షల 61వేల 631 ఇళ్ల వివరాలు నమోదు చేశారు. నగరం, పట్టణాల్లోనూ ధరణి సర్వే 95 శాతం పూర్తయింది. ఖమ్మం నగరంలో 93.50శాతం, వైరాలో 95.68శాతం, సత్తుపల్లి 94శాతం మధిరలో 94శాతం పూర్తయింది. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు పట్టణాల్లో 100శాతం ధరణి సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్​

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తుదిదశకు ఆస్తుల నమోదు ప్రక్రియ

వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి సర్వే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లక్ష్యాన్ని చేరుకుంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆస్తుల నమోదు ప్రక్రియ గడువు మేర సత్ఫలితాలు సాధిస్తోంది. ప్రతి పల్లె నుంచి పట్టణం, నగరాల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు యుద్ధప్రాతిపాదికన ఆస్తుల గణన చేపట్టారు. సర్వే మొదలైనప్పుడు కొన్ని చోట్ల అనేక రకాల ఇబ్బందులు, ఆన్‌లైన్‌లో సాంకేతిక పరమైన అవరోధాలు ఎదురైనా అధిగమిస్తూ లక్ష్యం మేర ప్రక్రియ పూర్తి చేసేలా చేపట్టిన కార్యాచరణ సఫలీకృతమైంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ఆర్.వి. కర్ణన్, ఎంవీ రెడ్డి ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతోపాటు దిశానిర్దేశం చేయడం వల్ల ఆస్తుల నమోదు పూర్తికావచ్చింది.

ప్రత్యేక బృందాలు రంగంలోకి..

గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ధరణి సర్వే బృందాలు రంగంలోకి దిగి ఆస్తుల నమోదు చేపట్టాయి. సెలవు దినాల్లోనూ ముమ్మరంగా సర్వే జరగడం వల్ల ప్రక్రియ పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చింది. వ్యవసాయేతర ఆస్తులకు ప్రత్యేకంగా పాసు పుస్తకం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో ప్రజలు కూడా సర్వేకు సహకరించారు. ఖమ్మం జిల్లాలో 93 శాతం ధరణి సర్వే పూర్తవ్వగా... భద్రాద్రి జిల్లాలో 99.53 శాతం పూర్తయినట్లు రెండు జిల్లాల అధికారులు ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలో 2లక్షల75వేల 164 ఇళ్ల వివరాలు సేకరించాల్సి ఉండగా... 2లక్షల 75వేల ఆస్తుల గణన పూర్తి చేశారు. జిల్లాలో 398 బృందాలు పనిచేశాయి.

పలు పట్టణాల్లో 100శాతం

ఖమ్మం జిల్లాలోని 584 పంచాయతీల్లో 2లక్షల 80వేల 811 ఆస్తుల నమోదు చేపట్టాల్సి ఉండగా... 2లక్షల 61వేల 631 ఇళ్ల వివరాలు నమోదు చేశారు. నగరం, పట్టణాల్లోనూ ధరణి సర్వే 95 శాతం పూర్తయింది. ఖమ్మం నగరంలో 93.50శాతం, వైరాలో 95.68శాతం, సత్తుపల్లి 94శాతం మధిరలో 94శాతం పూర్తయింది. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు పట్టణాల్లో 100శాతం ధరణి సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.