ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పెనుబల్లి, తల్లాడ, కల్లూరు మండలాల్లోని నలుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నియోజకవర్గంలో నాలుగున్నర కోట్ల నిధులు వచ్చాయన్నారు. ప్రభుత్వం పై నమ్మకంతో ఉన్న ప్రజలు ఇటీవల జరిగిన పురపాలక, నగరపాలక ఎన్నికల్లో తెరాసను గెలిపించారని చెప్పారు.
ఇవీ చూడండి: మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు కావాలి : హరీశ్రావు