ETV Bharat / state

REVANTH REDDY: హుజూరాబాద్ ఇంఛార్జీ, సమన్వయ కర్తల నియామకం

హుజూరాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇంఛార్జీగా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజ నర్సింహను, ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​లను నియమిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

author img

By

Published : Jul 14, 2021, 12:02 PM IST

Updated : Jul 14, 2021, 3:08 PM IST

tpcc-president-revanth-reddy-appointed-incharges-and-co-ordinators-of-huzurabad-assembly
హుజూరాబాద్ ఇంఛార్జీ, సమన్వయ కర్తల నియామకం

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలను, సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీగా మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజ నర్సింహను నియమించారు. నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​లను ప్రకటించారు.

మండలాల వారిగా వీణవంక మండలానికి ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్​లను, జమ్మికుంట మండలానికి విజయ రమణ రావ్, రాజ్ ఠాగూర్​లను, హుజూరాబాద్ మండలానికి టి. నర్సారెడ్డి, లక్ష్మణ్ కుమార్​లను, హుజూరాబాద్ పట్టణానికి బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావులను నియమించినట్లు తెలిపారు. అలాగే ఇల్లంతకుంట మండలానికి నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలను, కమలపూర్ మండలానికి కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్యలను, కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజకవర్గ సమాచారం కోసం దొంతి గోపిల పేర్లను ప్రకటించారు.

అసెంబ్లీ ఇంఛార్జీ: దామోదర రాజ నర్సింహ

సమన్వయ కర్తలు...

  1. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  2. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
  3. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​

మండలాల వారీగా...

  1. వీణవంక: ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్
  2. జమ్మికుంట: విజయ రమణ రావ్, రాజ్ ఠాగూర్​
  3. హుజూరాబాద్: టి. నర్సారెడ్డి, లక్ష్మణ్ కుమార్​
  4. హుజూరాబాద్ పట్టణానికి: బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు
  5. ఇల్లందకుంట: నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
  6. కమలపూర్: కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య

కంట్రోల్ రూమ్ సమన్వయ కర్త: కవ్వంపల్లి సత్యనారాయణ

నియోజకవర్గ సమాచారం కోసం: దొంతి గోపి

ఇదీ చూడండి: GONGURA: ఎన్నెన్ని సుగుణాలో... గోంగూరలో

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలను, సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీగా మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజ నర్సింహను నియమించారు. నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​లను ప్రకటించారు.

మండలాల వారిగా వీణవంక మండలానికి ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్​లను, జమ్మికుంట మండలానికి విజయ రమణ రావ్, రాజ్ ఠాగూర్​లను, హుజూరాబాద్ మండలానికి టి. నర్సారెడ్డి, లక్ష్మణ్ కుమార్​లను, హుజూరాబాద్ పట్టణానికి బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావులను నియమించినట్లు తెలిపారు. అలాగే ఇల్లంతకుంట మండలానికి నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలను, కమలపూర్ మండలానికి కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్యలను, కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజకవర్గ సమాచారం కోసం దొంతి గోపిల పేర్లను ప్రకటించారు.

అసెంబ్లీ ఇంఛార్జీ: దామోదర రాజ నర్సింహ

సమన్వయ కర్తలు...

  1. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  2. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
  3. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​

మండలాల వారీగా...

  1. వీణవంక: ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్
  2. జమ్మికుంట: విజయ రమణ రావ్, రాజ్ ఠాగూర్​
  3. హుజూరాబాద్: టి. నర్సారెడ్డి, లక్ష్మణ్ కుమార్​
  4. హుజూరాబాద్ పట్టణానికి: బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు
  5. ఇల్లందకుంట: నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
  6. కమలపూర్: కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య

కంట్రోల్ రూమ్ సమన్వయ కర్త: కవ్వంపల్లి సత్యనారాయణ

నియోజకవర్గ సమాచారం కోసం: దొంతి గోపి

ఇదీ చూడండి: GONGURA: ఎన్నెన్ని సుగుణాలో... గోంగూరలో

Last Updated : Jul 14, 2021, 3:08 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.