ETV Bharat / state

రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు: మేయర్‌ సునీల్‌రావు

author img

By

Published : May 21, 2021, 5:14 PM IST

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 70 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని... మేయర్ సునీల్ రావు తెలిపారు. నగరంలోని 54 వ డివిజన్ లో రైతు బజార్‌ను కమిషనర్ క్రాంతితో కలిసి ఆయన పరిశీలించారు.

development works in Karimnagar
కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌ రావు

నగరపాలిక పరిధిలోని కాశ్మీర్ గడ్డ రైతు బజార్‌ను త్వరలోనే ఆధునీకరిస్తామని... మేయర్‌ సునీల్‌ రావు అన్నారు. ప్రజల సౌకర్యార్ధం నూతనంగా నిర్మాణం చేపడతామని తెలిపారు. నగరంలోని 54 వ డివిజన్ లో రైతు బజార్‌ను కమిషనర్ క్రాంతితో కలిసి ఆయన పరిశీలించారు.

ఒక్కోచోట కూరగాయలతో పాటు మాంసాహారము లభించేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే పనులను చేపడతామని అన్నారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో రూ. 70 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మేయర్‌ పేర్కొన్నారు.

నగరపాలిక పరిధిలోని కాశ్మీర్ గడ్డ రైతు బజార్‌ను త్వరలోనే ఆధునీకరిస్తామని... మేయర్‌ సునీల్‌ రావు అన్నారు. ప్రజల సౌకర్యార్ధం నూతనంగా నిర్మాణం చేపడతామని తెలిపారు. నగరంలోని 54 వ డివిజన్ లో రైతు బజార్‌ను కమిషనర్ క్రాంతితో కలిసి ఆయన పరిశీలించారు.

ఒక్కోచోట కూరగాయలతో పాటు మాంసాహారము లభించేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే పనులను చేపడతామని అన్నారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో రూ. 70 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మేయర్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పెరోల్​పై డేరా బాబా విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.