ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి'

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని కరీంనగర్​ మేయర్​ యాదగిరి సునీల్​రావు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్​లోని 31వ డివిజన్​లో మేయర్​తో పాటు నగరపాలక కమిషనర్​ క్రాంతి వల్లూరి, కార్పొరేటర్​ స్వప్న మొక్కలు నాటారు.

author img

By

Published : Jul 25, 2020, 1:27 PM IST

karimnagar mayor sunil rao participated harithaharam programme
'సమతుల్యమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలు ముందుకు రావాలి'

హరితహారంలో భాగంగా కరీంనగర్​లోని 31వ డివిజన్​లో నగర పాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక కమిషనర్ క్రాంతి వల్లూరి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ లెక్కల స్వప్న వేణు, కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీలో ఇంటింటికీ ఆరు రకాల మొక్కలను పంపిణీ చేస్తున్నామని మేయర్​ అన్నారు.

ప్రతి ఒక్కరు ఇంటి ముందు కానీ, ఆవరణలో కానీ మొక్కలను నాటి సంరక్షించుకోవాలని సూచించారు. సమతుల్యమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మేయర్​ కోరారు.

హరితహారంలో భాగంగా కరీంనగర్​లోని 31వ డివిజన్​లో నగర పాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక కమిషనర్ క్రాంతి వల్లూరి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ లెక్కల స్వప్న వేణు, కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీలో ఇంటింటికీ ఆరు రకాల మొక్కలను పంపిణీ చేస్తున్నామని మేయర్​ అన్నారు.

ప్రతి ఒక్కరు ఇంటి ముందు కానీ, ఆవరణలో కానీ మొక్కలను నాటి సంరక్షించుకోవాలని సూచించారు. సమతుల్యమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మేయర్​ కోరారు.

ఇవీ చూడండి: తెలంగాణలో పచ్చదనం బాగా పెరిగింది: గోపీచంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.