ETV Bharat / state

'ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలి'

ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కరీంనగర్​ జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.  కలెక్టరేట్​లోని రెవెన్యూ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని సెక్షన్లలో పెండింగ్ ఫైల్స్​ ఉండకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

author img

By

Published : Dec 29, 2019, 1:38 PM IST

karimnagar collector shashanka inspected revenue office in collectorate
'ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలి'
'ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలి'

కరీంనగర్​ జిల్లా కలెక్టరేట్​లోని రెవెన్యూ విభాగాలను కలెక్టర్​ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్​ ఫైల్స్​ ఉండకుండా సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్​లోని అన్ని కార్యాలయాల్లో స్త్రీ,పురుషుల ఉద్యోగుల వివరాలు సేకరించి వారికి సరిపడా టాయిలెట్లు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మహిళా ఉద్యోగులకు ఫీడింగ్​ రూం ఏర్పాటు చేయాలని తెలిపారు.

రికార్డు రూంలో ఉన్న పురాతన రికార్డులను డిజిటలైజేషన్​ చేయాలని కలెక్టర్​ శశాకం అధికారులను ఆదేశించారు. సూపరింటెండెంట్​ల విభాగాలు ఆధునీకరించి, సీసీ కెమెరాలు సరిగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి జిల్లా రెవెన్యూ అధికారి, ఏఓలు పరిశీలించడానికి మానిటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

'ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలి'

కరీంనగర్​ జిల్లా కలెక్టరేట్​లోని రెవెన్యూ విభాగాలను కలెక్టర్​ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్​ ఫైల్స్​ ఉండకుండా సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్​లోని అన్ని కార్యాలయాల్లో స్త్రీ,పురుషుల ఉద్యోగుల వివరాలు సేకరించి వారికి సరిపడా టాయిలెట్లు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మహిళా ఉద్యోగులకు ఫీడింగ్​ రూం ఏర్పాటు చేయాలని తెలిపారు.

రికార్డు రూంలో ఉన్న పురాతన రికార్డులను డిజిటలైజేషన్​ చేయాలని కలెక్టర్​ శశాకం అధికారులను ఆదేశించారు. సూపరింటెండెంట్​ల విభాగాలు ఆధునీకరించి, సీసీ కెమెరాలు సరిగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి జిల్లా రెవెన్యూ అధికారి, ఏఓలు పరిశీలించడానికి మానిటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Intro:TG_KRN_07_29_COLLECTER_OFFICES_CLEEN_TS10036
Sudhakar contributer karimnagr

          ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. కలెక్టరేట్ లోని రెవెన్యూ విభాగాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. కలెక్టర్ రెవెన్యూ పరిపాలన విభాగం లోని అన్ని సెక్షన్లను, రికార్డ్ రూం లను తనిఖీ చేశారు. కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలోని అన్ని సెక్షన్లలో పెండింగ్ ఫైల్ ఉండకుండా వెంటవెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇన్వర్డ్ లో వచ్చిన లెటర్స్ ను ఏరోజుకు ఆ రోజుకు సంబంధిత సెక్షన్లకు అందజేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులని ప్రాధాన్యతగా పరిష్కరించాలని, రెండవసారి కార్యాలయానికి ఫిర్యాదు దారులు రాకుండా చూడాలని ఆదేశించారు. కార్యాలయం లో పనికిరాని సామాన్లను తొలగించాలని ఆదేశించారు. కార్యాలయం లో కరెంటు లూస్ వైర్లు లేకుండా వెంటనే సరి చేయించాలని ఆదేశించారు. అన్ని కార్యాలయాలలో స్త్రి పురుషుల ఉద్యోగుల వివరాలను సేకరించి వారికి సరిపడ టాయిలెట్లను కార్యాలయాల వారీగా నిర్మించుటకు గుర్తించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. చిన్నపిల్లల తల్లుల మహిళ ఉద్యోగులకు ఫీడింగ్ రూం లను ఏర్పాటు చేయుటకు స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. వివిధ కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చు ప్రజల సౌకర్యార్థం టాయిలెట్ నిర్మాణానికి స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. రికార్డ్ రూం లో గల అమూల్యమైన పురాతన రికార్డులను డిజిటలైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని అదేశించారు. రికార్డులన్నింటిని మాడరైజేషన్ ర్యాకులలో భద్రపరుచుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సూపరింటెండెంట్ల విభాగాలను ఆధునీకరిస్తామని తెలిపారు. విభాగాలలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు సరిగా పని చేస్తున్నవి లేనివి సరి చూసుకోని జిల్లా రెవెన్యూ అధికారి, ఏ.ఓ.లు పరిశీలించటానికి మానిటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
         Body:హ్హ్Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.