ETV Bharat / state

రూ.10 లక్షల విలువ చేసే నిషేధిత గడ్డిమందు స్వాధీనం

నిషేధంలో ఉన్న గడ్డిమందును అక్రమంగా సరఫరా చేస్తున్నారన్నా సమాచారం అందుకున్న కరీంనగర్​ టాస్క్​ఫోర్స్​  పోలీసులు మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని.. రూ.10 లక్షల విలువ చేసే.. నిషేధిత గడ్డిమందును స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jul 5, 2020, 5:54 PM IST

Updated : Jul 5, 2020, 7:19 PM IST

Karim nagar Task force police caught Banned Grass Fertilizer Smugglers
రూ.10 లక్షల విలువ చేసే నిషేధిత గడ్డిమందు స్వాధీనం

కరీంనగర్​లో అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షలు విలువ చేసే.. నిషేధిత గడ్డిమందును టాస్క్​ఫోర్స్​ పోలీసులు కరీంనగర్​ నాకా చౌరస్తాలో పట్టుకున్నారు. కరీంనగర్​ మూడవ పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన దుంప సదాశివం, సిద్ధిపేట జిల్లాకు గజ్వేల్​కు చెందిన గునుకుల సునీల్​, కరీంనగర్ పట్టణానికి చెందిన బంగారి కార్తీక్​లు బృందంగా ఏర్పడి నిషేధిత గడ్డిమందు వ్యాపారం చేస్తున్నారు.

కరీంనగర్ నాకా చౌరస్తాలో నిషేధిత గడ్డిమందు డబ్బాలను ఎగుమతి చేయడానికి సిద్ధమవుతుండగా.. టాస్క్​ఫోర్స్​ పోలీసులు మెరుపుదాడి చేసి నిందితును అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా.. వరంగల్ జిల్లా మట్వాడాకు చెందిన ఏరుకుల వేదప్రకాష్, కరీంనగర్ పట్టణానికి చెందిన శ్రీనివాస్​లు కరీంనగర్​కు చెందిన వాసవి ట్రాన్స్​పోర్ట్ ద్వారా పంపుతున్నట్టు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 200 లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్న పోలీసులు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

కరీంనగర్​లో అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షలు విలువ చేసే.. నిషేధిత గడ్డిమందును టాస్క్​ఫోర్స్​ పోలీసులు కరీంనగర్​ నాకా చౌరస్తాలో పట్టుకున్నారు. కరీంనగర్​ మూడవ పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన దుంప సదాశివం, సిద్ధిపేట జిల్లాకు గజ్వేల్​కు చెందిన గునుకుల సునీల్​, కరీంనగర్ పట్టణానికి చెందిన బంగారి కార్తీక్​లు బృందంగా ఏర్పడి నిషేధిత గడ్డిమందు వ్యాపారం చేస్తున్నారు.

కరీంనగర్ నాకా చౌరస్తాలో నిషేధిత గడ్డిమందు డబ్బాలను ఎగుమతి చేయడానికి సిద్ధమవుతుండగా.. టాస్క్​ఫోర్స్​ పోలీసులు మెరుపుదాడి చేసి నిందితును అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా.. వరంగల్ జిల్లా మట్వాడాకు చెందిన ఏరుకుల వేదప్రకాష్, కరీంనగర్ పట్టణానికి చెందిన శ్రీనివాస్​లు కరీంనగర్​కు చెందిన వాసవి ట్రాన్స్​పోర్ట్ ద్వారా పంపుతున్నట్టు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 200 లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్న పోలీసులు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఇదీ చూడండి: విదేశీ యాప్​లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'

Last Updated : Jul 5, 2020, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.