ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్కు రానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ఉదయం 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా 11 గంటల 30 నిమిషాలకు వేములవాడకు చేరుకుంటారని చెప్పారు. శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శించుకుని... మిడ్ మానేర్ సందర్శించి... మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ చేరుకుంటారని వివరించారు.
ఇదీ చూడండి:ఒప్పో 5జీ ఫోన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే...