ETV Bharat / state

50 ప్లేట్ల పూరీ ఆర్డరిచ్చి... రూ.25 వేలు కొట్టేశాడు! - atm fraud in jammikunta

50 ప్లేట్ల పూరీ ఆర్డరిచ్చి యజమాని దగ్గర్నుంచే రూ.25 వేలు దోచేసిన ఘటన కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో చోటుచేసుకుంది. టిఫిన్​ పార్శిల్​ డబ్బులు కట్టేందుకు యజమాని ఏటీఎం నెంబర్​ అడిగి... ఆదే ఖాతా నుంచి నగదు కాజేశాడు.

cyber crime in jammikunta
50 ప్లేట్ల పూరీ ఆర్డరిచ్చి రూ.25వేలు దోచేశాడు!
author img

By

Published : Jun 6, 2020, 3:29 PM IST

సైబర్ నేరగాళ్లు జడలు విప్పుతున్నారు .ఇప్పటి వరకు ప్రధాన పట్టణాలకే పరిమితమైన మోసాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సైబర్ నేరగాళ్లు ఓ హోటల్ యజమానిని బోల్తా కొట్టించి డబ్బు స్వాహా చేశారు. హోటల్‌ యజమాని మొగిలికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్​ చేసి 50 ప్లేట్ల పూరీ పార్శిల్​ కావాలని కోరాడు. ఏటీఎం కార్డు నెంబర్​ చెబితే డబ్బులు పంపిస్తానని.. కార్డును ఫోటో తీసి వాట్సప్​ ద్వారా పంపమన్నాడు.

నిజమే అనుకొని నమ్మిన హోటల్​ యజమాని తనకు పరిచయం ఉన్న వ్యక్తి సంతోశ్​ ఏటీఎం కార్డును ఫోటో తీసి పంపించాడు. సాంకేతికత ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తి... ఖాతా నుంచి రూ. 25,134 డ్రా చేసుకున్నాడు. డబ్బులు డ్రా అయినట్లు చరవాణికి సమాచారం రావటం వల్ల అప్రమత్తమైన సంతోశ్​.. బ్యాంక్‌ అధికారులను సంప్రదించాడు. తన ఖాతాను నిలుపుదల చేయించుకున్నాడు. ఘటనపై బాధితుడు సంతోశ్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సృజన్‌రెడ్డి పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్​ చేసి వ్యక్తిగత సమాచారం అడిగినప్పుడు చెప్పకుండా... జాగ్రత్త పడాలని సూచించారు.

ఇదీ చదవండి: ఐదు రోజులు... ఆరు హత్యలు...

సైబర్ నేరగాళ్లు జడలు విప్పుతున్నారు .ఇప్పటి వరకు ప్రధాన పట్టణాలకే పరిమితమైన మోసాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సైబర్ నేరగాళ్లు ఓ హోటల్ యజమానిని బోల్తా కొట్టించి డబ్బు స్వాహా చేశారు. హోటల్‌ యజమాని మొగిలికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్​ చేసి 50 ప్లేట్ల పూరీ పార్శిల్​ కావాలని కోరాడు. ఏటీఎం కార్డు నెంబర్​ చెబితే డబ్బులు పంపిస్తానని.. కార్డును ఫోటో తీసి వాట్సప్​ ద్వారా పంపమన్నాడు.

నిజమే అనుకొని నమ్మిన హోటల్​ యజమాని తనకు పరిచయం ఉన్న వ్యక్తి సంతోశ్​ ఏటీఎం కార్డును ఫోటో తీసి పంపించాడు. సాంకేతికత ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తి... ఖాతా నుంచి రూ. 25,134 డ్రా చేసుకున్నాడు. డబ్బులు డ్రా అయినట్లు చరవాణికి సమాచారం రావటం వల్ల అప్రమత్తమైన సంతోశ్​.. బ్యాంక్‌ అధికారులను సంప్రదించాడు. తన ఖాతాను నిలుపుదల చేయించుకున్నాడు. ఘటనపై బాధితుడు సంతోశ్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సృజన్‌రెడ్డి పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్​ చేసి వ్యక్తిగత సమాచారం అడిగినప్పుడు చెప్పకుండా... జాగ్రత్త పడాలని సూచించారు.

ఇదీ చదవండి: ఐదు రోజులు... ఆరు హత్యలు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.