కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో భాజపా నుంచి కుందనపల్లి గీత, భాషబోయిన రమేష్ నామపత్రాలు సమర్పించారు. అధిష్ఠానం గీతను అభ్యర్థిగా ప్రకటించి బీ-ఫామ్ ఇచ్చింది.
గీత తన అనుచరులతో కలిసి బి-ఫామ్ సమర్పించేందుకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంది. అదే సమయంలో బాషబోయన రమేష్ కూడా అక్కడికి వచ్చాడు. గీత భర్త రవీందర్ రెడ్డి చేతిలో ఉన్న బీ-ఫామ్ని రమేష్ చింపేశాడు. కాసేపైతే అధికారులకు సమర్పించాల్సిన పత్రాలు చింపేసరికి... ఏం చేయాలో తోచలేదు. అభ్యర్థి విజ్ఞప్తి మేరకు భాజపా నాయకులు మరో బీ-ఫామ్ను అందించగా కథ సుఖాంతమైంది.
ఇదీ చూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'