కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వడ్ల వృత్తి సంఘం భవన నిర్మాణానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. 15 లక్షలతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని తొందరగా పూర్తి చేసుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో సామూహిక భవనాలు, కల్యాణ మండపాలు నిర్మించుకోవటానికి ఎనిమిది మండలాల్లో 7 కోట్ల 57 లక్షలు మంజూరైనట్లు స్పీకర్ వెల్లడించారు.
ఇవీచూడండి: 'మహా'లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు