కుమార్తెల వివాహాల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు బయట దేశానికి వెళ్ళిన కామారెడ్డి జిల్లా వాసి శంకరయ్య అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. జిల్లాలోని లింగాపూర్కు చెందిన 58 ఏళ్ల వడ్ల శంకరయ్య 20 సంవత్సరాల క్రితం గల్ఫ్ వెళ్లాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం తన గదిలో గుండెపోటుతో మరణించినట్లు పేర్కొన్నారు.
మృతుడికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారికోసం మొత్తం 11 లక్షల అప్పు ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని.. వీలైనంత త్వరగా మృతదేహాన్ని తెప్పించాలని కోరారు. స్థానికులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ను కలిసి శంకరయ్య కుటుంబ సభ్యుల బాధను తెలియజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి.. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: మహాశివరాత్రి స్పెషల్: వేములవాడకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం