జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, మల్దకల్, ధరూర్ మండలాల్లో ఉన్న వైన్ షాపులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత రెండు రోజుల నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం టాస్క్ఫోర్స్ బృందం, ఇతర బృందాలు గద్వాల పీఎస్ పరిధిలో గల వైన్ షాపుల్లో సోదాలు జరిపారు. నిబంధనలు ఉల్లఘించిన ఆయా వైన్షాపుల మీద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
అలాగే బుధవారం కూడా పలు వైన్షాపులపై సోదాలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన ఐదు మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలోకి మిడతలు రాకుండా ప్రత్యేక కమిటీ: సీఎం కేసీఆర్