ETV Bharat / state

కొవిడ్​తో చనిపోయిన మహిళకు అన్నీ తానై..!

author img

By

Published : May 2, 2021, 4:52 PM IST

కరోనాతో ప్రాణాలు విడిచిన ఓ మహిళ మృతదేహానికి స్థానిక టీబీజీకేస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అంత్యక్రియలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇది జరిగింది.

Funeral of the corona dead body
Funeral of the corona dead body

కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో కరోనాతో మృతి చెందిన ఓ మహిళ అంత్యక్రియలను స్థానిక టీబీజీకేస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు దగ్గరుండి జరిపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన తుమ్మ లక్ష్మీ.. కొవిడ్​తో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు విడిచింది.

విషయం తెలుసుకున్న కొక్కుల తిరుపతి.. కుటుంబానికి అండగా నిలబడి కరోనా నిబంధనల మేరకు దహన సంస్కారాలను నిర్వహించారు.

కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో కరోనాతో మృతి చెందిన ఓ మహిళ అంత్యక్రియలను స్థానిక టీబీజీకేస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు దగ్గరుండి జరిపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన తుమ్మ లక్ష్మీ.. కొవిడ్​తో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు విడిచింది.

విషయం తెలుసుకున్న కొక్కుల తిరుపతి.. కుటుంబానికి అండగా నిలబడి కరోనా నిబంధనల మేరకు దహన సంస్కారాలను నిర్వహించారు.

ఇదీ చదవండి: సౌకర్యాలు ఉన్నా వైద్యుల కొరత.. కరోనా బాధితులకు ఓదార్పు కరవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.