ETV Bharat / state

కొవిడ్ మృతదేహానికి అంత్యక్రియలు జరిపిన ఎమ్మెల్యే

author img

By

Published : May 21, 2021, 9:24 AM IST

కరోనా.. బంధాలు, అనుబంధాలను దూరం చేస్తోంది. మనిషి చివరి చూపును కూడా.. నోచుకోకుండా చేస్తోంది. బంధుమిత్రులు.. మృతదేహాం దగ్గరకు రావడానికే జంకుతున్నారు. జయశంకర్​ జిల్లా కేంద్రంలో ఇలాగే అంత్యక్రియలు జరపడానికి గ్రామస్థులు నిరాకరించడంతో.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి చొరవతో కొవిడ్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు.

funeral for covid dead body
funeral for covid dead body

కొవిడ్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి గ్రామస్థులెవరూ ముందుకు రావడంతో.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టారు. జయశంకర్​ జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ శ్మశాన వాటికలో రేగొండకు చెందిన కొవిడ్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

వైరస్​తో మృతి చెందినవారి అంత్యక్రియలకు దూరంగా ఉండటం సమంజసం కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదరిస్తూ.. సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కనీసం దహనసంస్కారలైన నిర్వహించాలన్నారు. మహమ్మారి పట్ల ప్రజలందరూ జాగ్రత్త వహించాలని సూచించారు.

కొవిడ్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి గ్రామస్థులెవరూ ముందుకు రావడంతో.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టారు. జయశంకర్​ జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ శ్మశాన వాటికలో రేగొండకు చెందిన కొవిడ్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

వైరస్​తో మృతి చెందినవారి అంత్యక్రియలకు దూరంగా ఉండటం సమంజసం కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదరిస్తూ.. సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కనీసం దహనసంస్కారలైన నిర్వహించాలన్నారు. మహమ్మారి పట్ల ప్రజలందరూ జాగ్రత్త వహించాలని సూచించారు.

ఇదీ చదవండి: కరోనా సెకండ్‌వేవ్‌లో 10శాతం వరకు చిన్నారులపై ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.