దాడులకు, హింసకు గురైన మహిళలను తరలించడానికి సఖి కేంద్రం ద్వారా ఏర్పాటు చేసిన 181 అంబులెన్స్ సర్వీసును జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహహ్మద్ అబ్దుల్ అజీమ్ ప్రారంభించారు. మహిళలు ఎవరు అత్యాచారాలకు, అణిచివేతకు గురికాకుడదనే ప్రధాన ఉద్దేశంతో సఖి కేంద్రం నిర్వహిస్తున్నామని తెలిపారు.
బాధిత మహిళలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా... లీగల్కూడా సహకారం అందిస్తామని... బాధిత మహిళకు న్యాయం జరిగేలా చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. సఖి కేంద్రం బలోపేతానికి జిల్లా కలెక్టర్గా పూర్తి మద్దతు ఇస్తామన్నారు. అదేవిధంగా జిల్లాలో మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి సహకారం కావాలన్నా తమ వంతు సాయం అందిస్తున్నామని తెలిపారు.
ఇవీ చూడండి: 'కొన్నాళ్లు ఉద్యోగాల భర్తీ నిలిపేయటం తప్పదు'