జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన బాస శ్రీనివాస్ ఉపాధి కోసం షార్జా వెళ్లాడు. అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నానంటూ రోదిస్తున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గతేడాది జులై 19న శ్రీనివాస్ను ఓ ఏజెంట్ రూ. 75,000 తీసుకుని షార్జాలో ఓ కంపెనీలో పని ఉందంటూ పంపించాడని తెలిపారు. ఏజెంట్ చెప్పిన నిబంధనలు లేకపోగా కంపెనీ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని శ్రీనివాస్ అన్నాడు. వీడియో రాష్ట్ర సర్కారుకు చేరుకునేలా షేర్ చేయండి అంటూ శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్ ఎక్కడిది?