ETV Bharat / state

గుణాత్మకమైన మార్పుల కోసం 16 స్థానాలు గెలవాలి

చేవెళ్ల తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి నియోజకవర్గం​ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దేశంలో గుణాత్మకమైన మార్పుల కోసం 16 స్థానాలను గెలిపించాలని కోరారు.

author img

By

Published : Mar 31, 2019, 7:18 PM IST

జోరుగా తెరాస ప్రచారం
జోరుగా తెరాస ప్రచారం
హైదరాబాద్​లోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చేవెళ్ల తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. చందానగర్, మియాపూర్ డివిజన్​​లలో తెరాస శ్రేణుల బైక్ ర్యాలీలు నిర్వహించారు. బీకే రాఘవ రెడ్డి గార్డెన్​లో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశంలో గుణాత్మకమైన మార్పులు జరగాలంటే తెరాస 16 ఎంపీ స్థానాలు గెలవాలన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్, భాజపాలతో విసుగు చెందారు. అందుకే ప్రత్యామ్నాయ శక్తిగా కేసీఆర్ నేతృత్వంలోని సమాఖ్య కూటమి వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు.

ఇవీ చూడండి :నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు

జోరుగా తెరాస ప్రచారం
హైదరాబాద్​లోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చేవెళ్ల తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. చందానగర్, మియాపూర్ డివిజన్​​లలో తెరాస శ్రేణుల బైక్ ర్యాలీలు నిర్వహించారు. బీకే రాఘవ రెడ్డి గార్డెన్​లో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశంలో గుణాత్మకమైన మార్పులు జరగాలంటే తెరాస 16 ఎంపీ స్థానాలు గెలవాలన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్, భాజపాలతో విసుగు చెందారు. అందుకే ప్రత్యామ్నాయ శక్తిగా కేసీఆర్ నేతృత్వంలోని సమాఖ్య కూటమి వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు.

ఇవీ చూడండి :నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.