ETV Bharat / state

గవర్నర్​కు ఉత్తమ్ లేఖ... మండలి ఛైర్మన్ తీరుపై ఫిర్యాదు - మండలి ఛైర్మన్​ గుత్తా సుకేందర్​ రెడ్డిపై గవర్నర్​కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్​కుమార్​ రెడ్డి

రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి గవర్నర్​కు లేఖ రాశారు. శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి హుజూర్​నగర్ ఉపఎన్నిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ గవర్నర్‌ తమిళి సైకు ఉత్తమ్​ ఫిర్యాదు చేశారు.

మండలి ఛైర్మన్​పై గవర్నర్​కు ఉత్తమ్​ ఫిర్యాదు
author img

By

Published : Sep 27, 2019, 7:52 PM IST

Updated : Sep 28, 2019, 7:07 AM IST

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ గవర్నర్​ తమిళిసైకు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ లేఖ రాశారు. శాసన మండలి ఛైర్మన్​గా ఉన్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. పాలకీడు జడ్పీటీసీ సభ్యుడు మోతీలాల్‌ నాయక్‌, సర్పంచి జితేందర్‌ రెడ్డిని... ఫిల్మ్‌ ఛాంబరులోని తన ఇంటికి పిలిపించుకుని పెద్దమొత్తంలో డబ్బు ఆశచూపి ప్రలోభ పెట్టారని ఆరోపించారు. అదేవిధంగా పలువురు కాంగ్రెస్‌ నేతలను కూడా పిలుస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుమారుడు అమిత్‌ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టులో 15వ ప్యాకేజీకి సంబంధించి రూ.719 కోట్లు విలువైన పనులను, ఆయన బంధువుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు చెందిన రెండు ప్యాకేజీల కింద 37వేల కోట్లకు పైగా విలువైన పనులను అప్పగించినట్లు ఆరోపించారు. హుజూర్​నగర్​లో ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.

గవర్నర్​కు ఉత్తమ్ లేఖ... మండలి ఛైర్మన్ తీరుపై ఫిర్యాదు

ఇదీ చూడండి: ఆంధ్ర వ్యక్తికి హుజూర్​నగర్​ టికెటెలా ఇచ్చారు?: ఉత్తమ్

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ గవర్నర్​ తమిళిసైకు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ లేఖ రాశారు. శాసన మండలి ఛైర్మన్​గా ఉన్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. పాలకీడు జడ్పీటీసీ సభ్యుడు మోతీలాల్‌ నాయక్‌, సర్పంచి జితేందర్‌ రెడ్డిని... ఫిల్మ్‌ ఛాంబరులోని తన ఇంటికి పిలిపించుకుని పెద్దమొత్తంలో డబ్బు ఆశచూపి ప్రలోభ పెట్టారని ఆరోపించారు. అదేవిధంగా పలువురు కాంగ్రెస్‌ నేతలను కూడా పిలుస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుమారుడు అమిత్‌ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టులో 15వ ప్యాకేజీకి సంబంధించి రూ.719 కోట్లు విలువైన పనులను, ఆయన బంధువుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు చెందిన రెండు ప్యాకేజీల కింద 37వేల కోట్లకు పైగా విలువైన పనులను అప్పగించినట్లు ఆరోపించారు. హుజూర్​నగర్​లో ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.

గవర్నర్​కు ఉత్తమ్ లేఖ... మండలి ఛైర్మన్ తీరుపై ఫిర్యాదు

ఇదీ చూడండి: ఆంధ్ర వ్యక్తికి హుజూర్​నగర్​ టికెటెలా ఇచ్చారు?: ఉత్తమ్

TG_Hyd_66_27_UTTAM_LETTER_TO_GOVERNOR_AV_3038066 Reporter : Tirupal Reddy గవర్నర్‌కు ఉత్తమ్‌ రాసిన లేఖను...డెస్క్‌ వాట్సప్‌లో పంపాను. వాడుకోగలరు. ()హుజుర్ నగర్ ఉపఎన్నిక వ్యవహారాల్లో రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రత్యక్షంగా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర గవర్నర్‌ తమిళ సై సౌందర్‌ రాజన్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు వారి పదవీకాలం ముగిసే వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సి ఉందని పేర్కొన్నారు. హూందా నడుచుకోవాల్సిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఇటీవల పాలకీడు జడ్పీటీసీ సభ్యుడు మోతిలాల్‌ నాయక్‌, సర్పంచి జీతేందర్‌ రెడ్డిలను హైదరాబాద్‌ ఫిల్మ్‌ చాంబరులోని తన ఇంటికి పిలిపించుకుని పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి ప్రలోభ పెట్టారని ఆరోపించారు. అదే విధంగా పలువురు కాంగ్రెస్‌ నేతలను కూడా పిలుస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన కుమారుడు అమిత్‌ రెడ్డికి కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి 15వ ప్యాకేజికి చెంది రూ.719 కోట్లు విలువైన పనులను, కొడుకు మామకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు చెంది రెండు ప్యాకేజీల కింద రూ.37వేల కోట్లకుపైగా విలువైన పనులను అప్పగించారన్నారు. అక్కడ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు. నైతికతను దృష్టిలో ఉంచుకుని గుత్తా సుఖేందర్‌ రెడ్డి చేత రాజీనామా చేయించాలని గవర్నర్‌ను
Last Updated : Sep 28, 2019, 7:07 AM IST

For All Latest Updates

TAGGED:

uttam letter
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.