ఐసీసీ విమెన్స్ అండర్-19 టీ20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టులో ముఖ్య సభ్యురాలు మన తెలంగాణకు చెందిన త్రిష అనే విషయం తెలిసిందే. కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ త్రిషకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తండ్రి గొంగిడి రామిరెడ్డితో కలిసి త్రిష మంత్రి కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
![Telangana State IT Minister KTR congratulates to Under19 Cricket Women World Cup winner Trisha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17702184_trisha-5.jpeg)
ఈ సందర్భంగా కేటీఆర్... త్రిష ఆట తీరును ప్రశంసించారు. అలాగే బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా భారత క్రికెట్ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్తో కలిసి యువ క్రికెటర్ త్రిష ఈస్ట్ మారేడుపల్లిలోని కోచింగ్ బియాండ్ క్రికెట్ అకాడమీలో మొక్క నాటారు.
![Telangana State IT Minister KTR congratulates to Under19 Cricket Women World Cup winner Trisha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17702184_trisha-7.jpeg)
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్లో భారత్ ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో త్రిష 24 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక త్రిష స్వస్థలం భద్రాచలం. ఆమె తండ్రి రామిరెడ్డి స్వతహాగా క్రీడాకారుడు. అండర్-16లో రాష్ట్ర హాకీ జట్టులో సభ్యుడైన ఆయన క్రికెట్ కూడా ఆడేవారు. ఆ తర్వాత జీవితంలో స్థిరపడటం మీద దృష్టి సారించిన ఆయన ఐటీసీ జిమ్ ట్రైనర్గా ఉద్యోగం చేస్తూ.. సొంతంగా జిమ్ నడిపేవారు. క్రీడాకారుడైన రామిరెడ్డి.. తన కూతుర్ని క్రికెటర్ చేయాలని ఆకాంక్షించారు. రెండున్నరేళ్ల వయసు నుంచే తనకు క్రికెట్పై ఆసక్తి కలిగేలా చేశారు.
![Telangana State IT Minister KTR congratulates to Under19 Cricket Women World Cup winner Trisha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17702184_trisha-3.jpeg)