హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్ నియోజకవర్గాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా భాజపా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హీరో నాగశౌర్యకు రూ.500 జరిమానా