ETV Bharat / state

Revanth reddy fires on BRS : 'బీజేపీలాగే.. బీఆర్​ఎస్ 30శాతం కమీషన్​ సర్కారు'

author img

By

Published : Jun 17, 2023, 7:21 PM IST

Revanth reddy on TSPSC board : కర్ణాటకలో బీజేపీకి, తెలంగాణలో బీఆర్​ఎస్​కు పెద్ద తేడా లేదని. అక్కడ బీజేపీది 40శాతం కమీషన్ సర్కార్ అయితే.. ఇక్కడ బీఆర్​ఎస్​ది 30 శాతం కమీషన్ సర్కార్ అని రేవంత్​రెడ్డి విమర్శించారు. టీఎస్​పీఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని.. ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిదని విమర్శించారు.

revanth reddy
revanth reddy

Revanth reddy fires on recruitment of TSPSC board : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​లో అనర్హులైన సభ్యులతో జరిగిన అన్ని నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి డిమాండ్ చేసారు. కర్ణాటకలో కాంగ్రెస్​ను చీల్చేందుకు బీజేపీ, కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించిన రేవంత్.. వందల కోట్లు ఖర్చు చేసి కర్ణాటకలో కాంగ్రెస్​ను ఓడించాలనుకున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో బీజేపీది 40శాతం కమీషన్ సర్కార్ అయితే.. ఇక్కడ బీఆర్​ఎస్​ది 30 శాతం కమీషన్ సర్కార్ అని విమర్శించారు.

లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. టీఎస్​పీఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని ఆరోపించారు. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది అని దుయ్యబట్టారు.

బీఆర్​ఎస్​కు కనువిప్పు కలిగే విధంగా కాంగ్రెస్​ పార్టీ విద్యార్థి నిరుద్యోగ గర్జనలతో అదిలాబాద్​, ఖమ్మం,నల్గొండ, మహబూబ్​నగర్​లో ప్రజల్లో విసృత్తంగా అవగాహన కలిగించిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్వపత్రాలన్నింటినీ సంతలో సరుకులు అమ్మినట్లుగా విక్రయించారని ఎద్దేవాచేశారు.

గాంధీభవన్​లో రేవంత్​రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి గడ్డం వినోద్​కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల,భీమిని,కన్నెపల్లి మండలాలకు చెందిన బీఆర్​ఎస్​ కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. రేవంత్​రెడ్డి వారందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు మీది క్రియాశీలక పాత్ర అని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు తనకే సిగ్గనిపిస్తుందని.. పక్కన కూర్చోబెట్టుకోవడానికి కేసీఆర్​కు ఏమి అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని.. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలని విజ్ఞప్తి చేశారు. పేపర్ లేకేజీకి మంత్రి కేటీఆర్ కారణం అని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

"లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్వపత్రాలన్నింటినీ సంతలో సరుకులు అమ్మినట్లుగా విక్రయించారు. టీఎస్​పీఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది. ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలి". - రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు

బీజేపీలాగే.. బీఆర్​ఎస్ 30శాతం కమీషన్​ సర్కారు

ఇవీ చదవండి:

Revanth reddy fires on recruitment of TSPSC board : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​లో అనర్హులైన సభ్యులతో జరిగిన అన్ని నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి డిమాండ్ చేసారు. కర్ణాటకలో కాంగ్రెస్​ను చీల్చేందుకు బీజేపీ, కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించిన రేవంత్.. వందల కోట్లు ఖర్చు చేసి కర్ణాటకలో కాంగ్రెస్​ను ఓడించాలనుకున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో బీజేపీది 40శాతం కమీషన్ సర్కార్ అయితే.. ఇక్కడ బీఆర్​ఎస్​ది 30 శాతం కమీషన్ సర్కార్ అని విమర్శించారు.

లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. టీఎస్​పీఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని ఆరోపించారు. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది అని దుయ్యబట్టారు.

బీఆర్​ఎస్​కు కనువిప్పు కలిగే విధంగా కాంగ్రెస్​ పార్టీ విద్యార్థి నిరుద్యోగ గర్జనలతో అదిలాబాద్​, ఖమ్మం,నల్గొండ, మహబూబ్​నగర్​లో ప్రజల్లో విసృత్తంగా అవగాహన కలిగించిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్వపత్రాలన్నింటినీ సంతలో సరుకులు అమ్మినట్లుగా విక్రయించారని ఎద్దేవాచేశారు.

గాంధీభవన్​లో రేవంత్​రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి గడ్డం వినోద్​కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల,భీమిని,కన్నెపల్లి మండలాలకు చెందిన బీఆర్​ఎస్​ కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. రేవంత్​రెడ్డి వారందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు మీది క్రియాశీలక పాత్ర అని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు తనకే సిగ్గనిపిస్తుందని.. పక్కన కూర్చోబెట్టుకోవడానికి కేసీఆర్​కు ఏమి అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని.. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలని విజ్ఞప్తి చేశారు. పేపర్ లేకేజీకి మంత్రి కేటీఆర్ కారణం అని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

"లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రశ్వపత్రాలన్నింటినీ సంతలో సరుకులు అమ్మినట్లుగా విక్రయించారు. టీఎస్​పీఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది. ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలి". - రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు

బీజేపీలాగే.. బీఆర్​ఎస్ 30శాతం కమీషన్​ సర్కారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.