తెలంగాణ పారా మెడికల్ కోర్సుల ప్రవేశాల తుది గడువును మంగళవారం పారా మెడికల్ బోర్డు విడుదల చేసింది. పారా మెడికల్ కోర్సు దరఖాస్తులు సమర్పించడానికి నవంబర్ 2 ఆఖరు తేదీగా ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ 10, 11 తేదీల్లో వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పారా మెడికల్ బోర్డు వివరించింది.
2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్ http://www.tspmb.telangana.gov.in ను సందర్శించాలని పేర్కొంది.
ఇదీ చదవండిః సీపీజెట్ పరీక్షా తేదీలను ప్రకటించిన ఉస్మానియా వర్సిటీ