నాంపల్లి టీఎన్జీవో భవన్లో తెలంగాణ ఉద్యోగుల ఐకాస సమావేశమైంది. గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. 12 వందల మంది తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించారని, ఆంధ్రాకు చెందిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇరు ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ విధానంతో ప్రభుత్వానికి, ఉద్యోగులకు నష్టం తప్ప ప్రయోజనం లేదని, దీన్ని రద్దు చేసి రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలపాలని ఐకాస నేత కారం రవీందర్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు.
ప్రభుత్వం పరిపాలనలో భాగంగ చేపట్టే సంస్కరణలకు ఉద్యోగులు పూర్తిగా సహాకారం అందిస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకురాలు మమత తెలిపారు. 43 శాతం ఐఆర్తో పాటు పదవి విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచాలని కోరారు. వెల్నెస్ సెంటర్లను అన్ని జిల్లాల్లో విస్తృతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : పొట్ట కూటికోసం పోయి... పోలీసుల చెరలో చిక్కారు