ETV Bharat / state

వరద బాధితులకు పరిహారం ప్రభుత్వ నిర్ణయమే: హైకోర్టు - వరద బాధితులకు పరిహారం అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ

వర్షాలకు నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలనే పిటిషన్​పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ విధానపరమైన విషయాల్లో తామెలా జోక్యం చేసుకుంటామని ప్రశ్నించగా.. ఉత్తరాఖండ్ వరదల్లో సుప్రీంకోర్టు పరిహారం విషయంలో తీర్పు ఇచ్చిందని పిటిషనర్​ తరపు న్యాయవాది పేర్కొనగా వాటి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

hearing on  flood relief fund to farmers at tg high court
వరద బాధితులకు పరిహారం.. ప్రభుత్వ నిర్ణయమే: హైకోర్టు
author img

By

Published : Aug 31, 2020, 2:55 PM IST

వరద బాధితులకు పరిహారం చెల్లింపు అంశం.. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు, ఇతర వృత్తుల వారికి జాతీయ విపత్తు నియంత్రణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డా. చెరుకు సుధాకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్, జస్టిస్ బి. విజయ్​సేన్​రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ప్రభుత్వ విధానపరమైన విషయాల్లో తామెలా జోక్యం చేసుకుంటామని హైకోర్టు ప్రశ్నించింది. అయితే విపత్తుల విషయంలో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయవచ్చునని.. గతంలో ఉత్తరాఖండ్​ వరదల సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. సుప్రీం తీర్పు వివరాలను సమర్పించాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

వరద బాధితులకు పరిహారం చెల్లింపు అంశం.. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు, ఇతర వృత్తుల వారికి జాతీయ విపత్తు నియంత్రణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డా. చెరుకు సుధాకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్, జస్టిస్ బి. విజయ్​సేన్​రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ప్రభుత్వ విధానపరమైన విషయాల్లో తామెలా జోక్యం చేసుకుంటామని హైకోర్టు ప్రశ్నించింది. అయితే విపత్తుల విషయంలో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయవచ్చునని.. గతంలో ఉత్తరాఖండ్​ వరదల సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. సుప్రీం తీర్పు వివరాలను సమర్పించాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:ఆన్​లైన్ ఓనం: వేడుకల్లో అబ్బురపరిచిన చిన్నారులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.