ETV Bharat / state

T Congress Party Public Meeting on October 31st : ఈనెల 31న కొల్లాపూర్​లో కాంగ్రెస్​ బహిరంగ సభ.. 28 నుంచి రెండో విడత బస్సుయాత్ర..!

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2023, 7:36 PM IST

T Congress Party Public Meeting on October 31st at Kollapur : కాంగ్రెస్​ పార్టీ తెలంగాణలో విజయమే లక్ష్యంగా దూసుకెళుతుంది. అందులో భాగంగా ఈనెల 31న కొల్లాపూర్​లో పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో రాహుల్​ గాంధీ పర్యటన ఉంటుందని కాంగ్రెస్​ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ వెల్లడించారు. అదే విధంగా రెండో విడత బస్సు యాత్ర ఈనెల 28 నుంచి 30 వరకు జరిగే అవకాశం ఉందన్నారు.

T Congress Party Public Meeting
T Congress Party Public Meeting on October 31st

T Congress Party Public Meeting on October 31st at Kollapur : ఈనెల 31వ తేదీన కొల్లాపూర్​లో పాలమూరు ప్రజా భేరి బహిరంగ సభ(Telangana Congress Public Meeting)ను నిర్వహిస్తున్నామని కాంగ్రెస్​ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ వెల్లడించారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే నెల మొదటి వారంలో రాహుల్​గాంధీ పర్యటన(Rahul Gandhi Tour in Telangana) ఉంటుందని ఆయన వెల్లడించారు. రాహుల్​గాంధీ రెండో విడత బస్సు యాత్రలో పాల్గొంటారని వివరించారు.

ఈనెల 26,27 తేదీలలో ఆరు గ్యారంటీలపై మాణిక్​రావ్​ ఠాక్రే, రేవంత్​ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్​కుమార్​ రెడ్డి, ఇతర సీనియర్​ నేతలు పర్యటిస్తారని తెలిపారు. ఈ రెండు తేదీల్లో రోజుకు రెండు నియోజకవర్గాలు చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి.. గ్యారెంటీలను వివరిస్తారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్​ వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ గెలుపు పవనాలు వీస్తున్నాయని.. అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాహుల్​గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు.. ప్రజల మద్దతు ఏ విధంగా ఉందో చూశారని అన్నారు. అందుకే రేవంత్​ రెడ్డి చెప్పినట్లు.. డిసెంబరు 9న కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని స్పష్టం చేశారు.

Congress Bus Yatra 2023 : రాష్ట్రంలో మూడు విడతలుగా కాంగ్రెస్ బస్సు యాత్ర.. 18న ప్రారంభం

Telangana Congress 2nd Phase Bus Yatra : కాంగ్రెస్​ పార్టీ రెండో విడత బస్సు యాత్ర(Congress Bus Yatra 2023) కూడా ఈనెల 28 నుంచి 30 వరకు జరిగే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్పష్టత బుధవారం, గురువారాల్లో వస్తుంది. దాదాపు 7 లేదా 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఇక బీఆర్​ఎస్​ పాలన చాలు అంటూ.. బంగారు తెలంగాణ కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యం అవుతుందని అంటున్నారని మహేశ్​గౌడ్​ తెలిపారు.

కాంగ్రెస్​ పార్టీ బస్సు యాత్ర షెడ్యూల్​ వివరాలు : అక్టోబరు 18న రామప్ప ఆలయం నుంచి మొదటి విడత కాంగ్రెస్​ విజయభేరీ బస్సు యాత్రను రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రారంభించారు. అనంతరం పార్టీ నేతలతో కలసి భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ బస్సు యాత్ర మూడు రోజుల పాటు సాగింది. అందులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ బహిరంగ సభల్లో పాల్గొని.. ప్రసంగించారు. ఇప్పుడు రెండో విడత బస్సు యాత్ర ఈనెల 28 నుంచి 30 జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్​ అధిష్ఠానం నుంచి సమాచారం. అనంతరం నామినేషన్లు పూర్తి అయిన తర్వాత మూడో దశ బస్సు యాత్ర జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్​ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు.

Rahul Gandhi Speech at Mortad : 'రాష్ట్రంలో బీజేపీ ఖతమ్ అయింది.. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామంటున్నారు'

Congress Bus Yatra 2023 Started : కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రారంభించిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ

T Congress Party Public Meeting on October 31st at Kollapur : ఈనెల 31వ తేదీన కొల్లాపూర్​లో పాలమూరు ప్రజా భేరి బహిరంగ సభ(Telangana Congress Public Meeting)ను నిర్వహిస్తున్నామని కాంగ్రెస్​ రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ వెల్లడించారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే నెల మొదటి వారంలో రాహుల్​గాంధీ పర్యటన(Rahul Gandhi Tour in Telangana) ఉంటుందని ఆయన వెల్లడించారు. రాహుల్​గాంధీ రెండో విడత బస్సు యాత్రలో పాల్గొంటారని వివరించారు.

ఈనెల 26,27 తేదీలలో ఆరు గ్యారంటీలపై మాణిక్​రావ్​ ఠాక్రే, రేవంత్​ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్​కుమార్​ రెడ్డి, ఇతర సీనియర్​ నేతలు పర్యటిస్తారని తెలిపారు. ఈ రెండు తేదీల్లో రోజుకు రెండు నియోజకవర్గాలు చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి.. గ్యారెంటీలను వివరిస్తారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్​ వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ గెలుపు పవనాలు వీస్తున్నాయని.. అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాహుల్​గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు.. ప్రజల మద్దతు ఏ విధంగా ఉందో చూశారని అన్నారు. అందుకే రేవంత్​ రెడ్డి చెప్పినట్లు.. డిసెంబరు 9న కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని స్పష్టం చేశారు.

Congress Bus Yatra 2023 : రాష్ట్రంలో మూడు విడతలుగా కాంగ్రెస్ బస్సు యాత్ర.. 18న ప్రారంభం

Telangana Congress 2nd Phase Bus Yatra : కాంగ్రెస్​ పార్టీ రెండో విడత బస్సు యాత్ర(Congress Bus Yatra 2023) కూడా ఈనెల 28 నుంచి 30 వరకు జరిగే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్పష్టత బుధవారం, గురువారాల్లో వస్తుంది. దాదాపు 7 లేదా 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఇక బీఆర్​ఎస్​ పాలన చాలు అంటూ.. బంగారు తెలంగాణ కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యం అవుతుందని అంటున్నారని మహేశ్​గౌడ్​ తెలిపారు.

కాంగ్రెస్​ పార్టీ బస్సు యాత్ర షెడ్యూల్​ వివరాలు : అక్టోబరు 18న రామప్ప ఆలయం నుంచి మొదటి విడత కాంగ్రెస్​ విజయభేరీ బస్సు యాత్రను రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రారంభించారు. అనంతరం పార్టీ నేతలతో కలసి భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ బస్సు యాత్ర మూడు రోజుల పాటు సాగింది. అందులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ బహిరంగ సభల్లో పాల్గొని.. ప్రసంగించారు. ఇప్పుడు రెండో విడత బస్సు యాత్ర ఈనెల 28 నుంచి 30 జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్​ అధిష్ఠానం నుంచి సమాచారం. అనంతరం నామినేషన్లు పూర్తి అయిన తర్వాత మూడో దశ బస్సు యాత్ర జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్​ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు.

Rahul Gandhi Speech at Mortad : 'రాష్ట్రంలో బీజేపీ ఖతమ్ అయింది.. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామంటున్నారు'

Congress Bus Yatra 2023 Started : కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రారంభించిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.