ETV Bharat / state

'నదులను బతికించటమే నేటి నాగరికత'

ఈషా ఫౌండేషన్ ఇచ్చిన 'కావేరి పిలుపు' మేరకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో సినీగేయ రచయిత అనంత శ్రీరామ్ మద్దతు ప్రకటించారు. నదుల పరిరక్షణ మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.

author img

By

Published : Sep 6, 2019, 12:35 PM IST

నదులను బతికించటం నేటి నాగరికత

నదుల వల్ల బతకటం అప్పటి నాగరికత... నదులను బతికించటం ఇప్పటి నాగరికత... అని అన్నారు సినీగేయ రచయిత అనంత శ్రీరామ్. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ఇచ్చిన కావేరి పిలుపునకు మద్దతుగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలకు నీటి సమస్యల తలెత్తకుండా సద్గురు ఇచ్చిన ఈ పిలుపునకు తెలుగు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కావేరి నది పరివాహక ప్రాంతంలో 242 కోట్ల మెుక్కలను ఈషా ఫౌండేషన్ నాటునున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రధాన కూడళ్లలో 3500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు పలికారని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

నదులను బతికించటమే నేటి నాగరికత

ఇదీచూడండి: నాసాకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థిని

నదుల వల్ల బతకటం అప్పటి నాగరికత... నదులను బతికించటం ఇప్పటి నాగరికత... అని అన్నారు సినీగేయ రచయిత అనంత శ్రీరామ్. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ఇచ్చిన కావేరి పిలుపునకు మద్దతుగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలకు నీటి సమస్యల తలెత్తకుండా సద్గురు ఇచ్చిన ఈ పిలుపునకు తెలుగు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కావేరి నది పరివాహక ప్రాంతంలో 242 కోట్ల మెుక్కలను ఈషా ఫౌండేషన్ నాటునున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రధాన కూడళ్లలో 3500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు పలికారని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

నదులను బతికించటమే నేటి నాగరికత

ఇదీచూడండి: నాసాకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థిని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.