లాక్డౌన్ వల్ల కుదేలైన చేనేత వృత్తులను అదుకొని.. కరోనా భృతిగా రూ. 20వేలు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంత్రి కేటీఆర్ స్పందించాలి..
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.క్రిష్ణయ్య సూచన మేరకు.. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. చిన్నచిన్న సమస్యలకే ట్విటర్ ద్వారా స్పందించే మంత్రి కేటీఆర్.. నేతన్నల చావులపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.
ఇళ్లలోనే దీక్ష ..
ఉత్తర తెలంగాణకు ఆయువుపట్టుగా ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ మూడేళ్లవుతున్నా ఎందుకు మొదలు పెట్టలేదని సురేశ్ ప్రశ్నించారు. కరోనా భయం వల్ల చేతి వృత్తుల పనులు ఆగిపోయి ఉపాధి దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలు నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి ఇళ్లలోనే దీక్ష చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్ గుప్తాకు పాజిటివ్