ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్​ రూ.3 లక్షల కోట్లు..! ఆమోదముద్ర వేయడమే ఎజెండాగా నేడు కేబినెట్​ భేటీ

author img

By

Published : Feb 5, 2023, 6:46 AM IST

Updated : Feb 5, 2023, 6:58 AM IST

State Cabinet Meeting Today: రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఇవాళ ఆమోదముద్ర వేయనుంది. శాసనసభ ఎన్నికల ఏడాది వేళ మరోమారు భారీ పద్దుకు సర్కార్ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు పెద్దపీట వేస్తూనే.. హామీల అమలు, ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకోనున్నారు. కేంద్రం నుంచి పన్నుల్లో వాటా, ప్రాయోజిత పథకాలు మినహా అదనపు నిధులు వచ్చే అవకాశం లేదని తేలింది. ఈ నేపథ్యంలో సొంత పన్నులు, ఇతర మార్గాలపైనే రాష్ట్రం ఎక్కువగా ఆధారపడనుంది. వచ్చే వార్షిక సంవత్సరానికి.. రాష్ట్ర బడ్జెట్ రూ.మూడు లక్షల కోట్లకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

Budget
Budget

State Cabinet Meeting Today: రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయడమే ఎజెండాగా మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు. ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ దఫాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. దీంతో ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఎన్నికల కోణంలో మరోమారు భారీ పద్దునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం కొనసాగుతోంది. మొదటి తొమ్మిది నెలల ఆదాయం, రాబడులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వచ్చేందుకు అవకాశం ఉన్న మొత్తం, తదితరాలను బేరీజు వేసుకొని.. రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తీసుకురానున్నారు. ప్రస్తుతం నడుస్తున్న 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాతో రూ.2 లక్షలా 52 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది లక్షా 93 వేల 29 కోట్ల రెవెన్యూ రాబడులు అంచనా వేయగా.. డిసెంబర్ చివరి నాటికి అంచనాలకు అనుగుణంగానే ఖజానాకు సమకూరాయి.

15 శాతానికిపైగా వృద్ధి ఉండొచ్చు: రూ.లక్షా 9 వేల 800 కోట్ల ఆదాయం వచ్చింది. పన్ను ఆదాయం లక్షా 26 వేల 606 కోట్లు అంచనా వేయగా... డిసెంబర్ చివరి నాటికి 92 వేల 66 కోట్లు సమకూరాయి. మిగిలిన మూడు నెలల్లోనూ ఇదే తరహాలో రాబడులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రవాణా పన్ను తదితరాల ద్వారా ఆశించిన ఆదాయం ఖజానాకు చేరుతుందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధిరేటు బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 15 శాతానికిపైగా వృద్ధి ఉండవచ్చని భావిస్తున్నారు. పన్నేతర రాబడి కూడా రూ.10 వేల కోట్ల వరకు వచ్చింది. భూముల వేలం తదితరాలు కొనసాగుతున్న తరుణంలో పన్నేతర రాబడి ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

రుణాలకు సంబంధించి కేంద్రం ఆంక్షలు: కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో మాత్రం ఈ ఏడాది బాగా కోతపడింది. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులు మాత్రమే వస్తున్నాయి. గ్రాంట్లను భారీగా అంచనా వేసినప్పటికీ రాష్ట్రానికి ఇప్పటికి వచ్చింది చాలా తక్కువే. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ల మొత్తం దాదాపు 60 వేల కోట్లు అంచనా వేయగా... డిసెంబర్ నెల వరకు వచ్చింది 16 వేల కోట్లు వచ్చాయి. ప్రత్యేకించి గ్రాంట్ల విషయంలో సర్కార్ అంచనాలు భారీగా తప్పాయి. 41 వేల కోట్లు అంచనా వేస్తే... డిసెంబర్ నెలాఖరు వరకు కేవలం 7 వేల 770 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాలకు సంబంధించి కూడా కేంద్రం ఆంక్షలు విధించింది.

ఎఫ్​ఆర్​బీఎంకు లోబడి ఏడాది 52 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించినప్పటికీ కేంద్రం ఆ మొత్తానికి అనుమతి ఇవ్వలేదు. కేవలం 37 వేల కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులకు కూడా ఆటంకం కలిగింది. డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం లక్షా 24 వేల కోట్లకు పైగా వ్యయం చేసింది. చివరి త్రైమాసికంలో వ్యయం ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి.... వ్యయం రెండు లక్షల కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

బడ్జెట్ ఖరారు చేయనున్న ప్రభుత్వం : 2023-24 బడ్జెట్ కోసం అన్ని శాఖలు మూడు లక్షలా 40 వేల కోట్ల వరకు ప్రతిపాదించినట్లు సమాచారం. శాఖల వారీగా జరిపిన కసరత్తులో ఆ మొత్తాన్ని కుదించినట్లు తెలిసింది. ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు నెరవేర్చాల్సిన హామీలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, ఆకాంక్షల అమలు తదితరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఖరారు చేయనుంది. సంక్షేమం, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు సహజంగానే కేటాయింపులు పెరగనున్నాయి. ప్రస్తుత ఏడాది ఆదాయ, వ్యయాలను బేరీజు వేస్తూ వచ్చే ఏడాది రాబడులు, అవసరాలను పరిగణలోకి తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్‌తో.. వచ్చే ఏడాది రాష్ట్రానికి వచ్చే నిధుల విషయమై స్పష్టత వచ్చింది.

2023-24 లో కేంద్ర పన్నుల నుంచి రాష్ట్ర వాటాగా 21 వేల కోట్లకు పైగా రానుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి నిధులు రానున్నాయి. రాష్ట్రానికి అదనపు నిధులు, గ్రాంట్లను కేంద్రం ప్రతిపాదించలేదు. రుణ పరిమితి పెంపునకు కూడా అనుమతించలేదు. దీంతో సొంత రాబడులు, ఇతర మార్గాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఆధార పడాల్సి ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని వార్షిక పద్దును ఆమోదించనున్నారు. ఎన్నికల కోణంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బడ్జెట్ తీసుకురానున్నారు. ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఏడాది బడ్జెట్ రెండు లక్షలా 52 వేల కోట్లు కాగా... రానున్న ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల కోట్ల మార్కును సమీపించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

State Cabinet Meeting Today: రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయడమే ఎజెండాగా మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు. ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ దఫాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. దీంతో ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఎన్నికల కోణంలో మరోమారు భారీ పద్దునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం కొనసాగుతోంది. మొదటి తొమ్మిది నెలల ఆదాయం, రాబడులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వచ్చేందుకు అవకాశం ఉన్న మొత్తం, తదితరాలను బేరీజు వేసుకొని.. రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తీసుకురానున్నారు. ప్రస్తుతం నడుస్తున్న 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాతో రూ.2 లక్షలా 52 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది లక్షా 93 వేల 29 కోట్ల రెవెన్యూ రాబడులు అంచనా వేయగా.. డిసెంబర్ చివరి నాటికి అంచనాలకు అనుగుణంగానే ఖజానాకు సమకూరాయి.

15 శాతానికిపైగా వృద్ధి ఉండొచ్చు: రూ.లక్షా 9 వేల 800 కోట్ల ఆదాయం వచ్చింది. పన్ను ఆదాయం లక్షా 26 వేల 606 కోట్లు అంచనా వేయగా... డిసెంబర్ చివరి నాటికి 92 వేల 66 కోట్లు సమకూరాయి. మిగిలిన మూడు నెలల్లోనూ ఇదే తరహాలో రాబడులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రవాణా పన్ను తదితరాల ద్వారా ఆశించిన ఆదాయం ఖజానాకు చేరుతుందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధిరేటు బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 15 శాతానికిపైగా వృద్ధి ఉండవచ్చని భావిస్తున్నారు. పన్నేతర రాబడి కూడా రూ.10 వేల కోట్ల వరకు వచ్చింది. భూముల వేలం తదితరాలు కొనసాగుతున్న తరుణంలో పన్నేతర రాబడి ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

రుణాలకు సంబంధించి కేంద్రం ఆంక్షలు: కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో మాత్రం ఈ ఏడాది బాగా కోతపడింది. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులు మాత్రమే వస్తున్నాయి. గ్రాంట్లను భారీగా అంచనా వేసినప్పటికీ రాష్ట్రానికి ఇప్పటికి వచ్చింది చాలా తక్కువే. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ల మొత్తం దాదాపు 60 వేల కోట్లు అంచనా వేయగా... డిసెంబర్ నెల వరకు వచ్చింది 16 వేల కోట్లు వచ్చాయి. ప్రత్యేకించి గ్రాంట్ల విషయంలో సర్కార్ అంచనాలు భారీగా తప్పాయి. 41 వేల కోట్లు అంచనా వేస్తే... డిసెంబర్ నెలాఖరు వరకు కేవలం 7 వేల 770 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాలకు సంబంధించి కూడా కేంద్రం ఆంక్షలు విధించింది.

ఎఫ్​ఆర్​బీఎంకు లోబడి ఏడాది 52 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించినప్పటికీ కేంద్రం ఆ మొత్తానికి అనుమతి ఇవ్వలేదు. కేవలం 37 వేల కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులకు కూడా ఆటంకం కలిగింది. డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం లక్షా 24 వేల కోట్లకు పైగా వ్యయం చేసింది. చివరి త్రైమాసికంలో వ్యయం ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి.... వ్యయం రెండు లక్షల కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

బడ్జెట్ ఖరారు చేయనున్న ప్రభుత్వం : 2023-24 బడ్జెట్ కోసం అన్ని శాఖలు మూడు లక్షలా 40 వేల కోట్ల వరకు ప్రతిపాదించినట్లు సమాచారం. శాఖల వారీగా జరిపిన కసరత్తులో ఆ మొత్తాన్ని కుదించినట్లు తెలిసింది. ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడు నెరవేర్చాల్సిన హామీలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, ఆకాంక్షల అమలు తదితరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఖరారు చేయనుంది. సంక్షేమం, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు సహజంగానే కేటాయింపులు పెరగనున్నాయి. ప్రస్తుత ఏడాది ఆదాయ, వ్యయాలను బేరీజు వేస్తూ వచ్చే ఏడాది రాబడులు, అవసరాలను పరిగణలోకి తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్‌తో.. వచ్చే ఏడాది రాష్ట్రానికి వచ్చే నిధుల విషయమై స్పష్టత వచ్చింది.

2023-24 లో కేంద్ర పన్నుల నుంచి రాష్ట్ర వాటాగా 21 వేల కోట్లకు పైగా రానుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి నిధులు రానున్నాయి. రాష్ట్రానికి అదనపు నిధులు, గ్రాంట్లను కేంద్రం ప్రతిపాదించలేదు. రుణ పరిమితి పెంపునకు కూడా అనుమతించలేదు. దీంతో సొంత రాబడులు, ఇతర మార్గాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఆధార పడాల్సి ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని వార్షిక పద్దును ఆమోదించనున్నారు. ఎన్నికల కోణంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బడ్జెట్ తీసుకురానున్నారు. ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఏడాది బడ్జెట్ రెండు లక్షలా 52 వేల కోట్లు కాగా... రానున్న ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల కోట్ల మార్కును సమీపించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 5, 2023, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.